Pawan Kalyan: మహిళలు, బాలికల అదృశ్యంపై గణాంకాలు బయటపెట్టిన కేంద్రం.. ఇప్పుడేమంటారు..?
Pawan Kalyan: 2019-21 మధ్య 30వేల మంది బాలికలు,మహిళలు అదృశ్యమయ్యారని కేంద్రమంత్రి చెప్పారని.. ఇప్పుడు మహిళా కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బాలికలు, మహిళలు ఎందుకు అదృశ్యమవుతున్నారని ప్రశ్నించారు. దీనిపై హోంమంత్రి , డీజీపీని.. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వివరణ అడగగలదా? చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వంపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోగలదా చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో భారీగా బాలికలు, మహిళలు అదృశ్యం అయ్యారని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. 2019-21లో 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యం అయ్యారు.. అసలు బాలికలు, మహిళలు ఎందుకు అదృశ్యమౌతున్నారు? అని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Read Also: DGP Rajendranath Reddy: ఆ జిల్లాల్లో నేరాలు గణనీయంగా తగ్గాయి-డీజీపీ
Also Read
- Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్రం ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. ఏపీ, తెలంగాణ…రెండు రాష్ట్రాల్లో కలిపి మూడేళ్లలో 72వేల 767 మంది బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారని స్పష్టం చేసింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అదశ్యమైనవారిలో 15వేల 994 మంది బాలికలున్నారని, 56 వేల773 మంది మహిళలున్నారని కేంద్రం స్పష్టం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఏపీ, తెలంగాణలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్న కేసులో ఏటా పెరుగుతున్నాయని నివేదికలో ప్రస్తావించారు. ఏపీలో 2019 నుంచి 2021వరకు మూడేళ్లలో 7వేల 928 మంది బాలికలు. .22వేల 278 మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఆ మూడేళ్లలో.. తెలంగాణలో 8వేల 66 మంది బాలికలు, 34 వేల 495 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొన్న తెలిసిందే.
మహిళలు… బాలికల అదృశ్యంపై @ysjagan సర్కార్ ఇప్పుడేం చెబుతుంది? – JanaSena Party PAC Chairman Shri @mnadendla#WakeupAPMahilaCommission #SaveAPfromYCP pic.twitter.com/PRD5OdZJUY
— JanaSena Party (@JanaSenaParty) July 26, 2023
తాజావార్తలు
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!