Pawan Kalyan: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు
- కాకినాడ జిల్లా గొల్లప్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
- పెంచన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్..
- ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి పిఠాపురానికి పవన్..
- కీలకమైన శాఖలు తీసుకున్నాను.. మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకుని ప్రజలకు మేలు చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వస్తూ వస్తూనే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పనిలో దిగిపోయారు.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా.. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పెంచన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ క్రింద వృద్దులకు 7000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు పంపిణీ చేశారు.. అయితే, దివ్యాంగులకు నాలుగు శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. దివ్యాంగుల పెన్షన్. 3000 నుండి 6000 రూపాయలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు..
Read Also: Thailand: రూ.50 వేలతో థాయ్లాండ్ను సందర్శించొచ్చు.. వసతి, ఆహారం అన్ని ఈ బడ్జెట్లోనే!
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ఇక, ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి వచ్చా పిఠాపురానికి వచ్చారు.. గెలిచిన వెంటనే. పనిలోకి దిగాను అని తెలిపారు.. విజయోత్సవ సభలతో సమయం వృధా చేసుకోవడం ఇష్టం లేదు.. కీలకమైన శాఖలు తీసుకున్నాను.. మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకుని ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేస్తున్నాను అన్నారు.. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ రావని ప్రచారం చేస్తే గుర్తింపు చేసి అందజేస్తున్నాం.. వైసీపీ లాగా కాకుండా.. సంక్షేమం, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం అన్నారు.. వైసీపీ పాలనలో ప్యాలెస్ నిర్మాణానికే ప్రాధాన్యత ఇచ్చారు అంటూ ఎద్దేవా చేశారు.. పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్న.. కానీ, ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవు.. అందుకే నా జీతం కూడా వదిలేశాను అన్నారు.. ఇక, లబ్ధిదారులకు అందజేస్తున్నా సంక్షేమ పథకాలను రీ సర్వే చేపడతాం.. ప్రజలకు పని చేసి మన్ననలు పొందిన తరువాతే విజయోత్సవం చేసుకుంటాను.. పిఠాపురం నియోజకవర్గంలోని మోడల్ విలేజ్ లుగా చేస్తా.. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా పరిపాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడతా.. రాజకీయాలకు డబ్బులకు సంబంధంలేదు.. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే. పనులు అన్ని చిటికెలో చేస్తారని కోరుకుంటారు. చిటికెలో పని జరిగేలా కృషి చేస్తాను.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 వేలు. పెన్షన్ ఇచ్చి 300 కమీషన్ తీసుకునే వారు.. ఇలా జరగకుండా కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!