Thailand: రూ.50 వేలతో థాయ్లాండ్ను సందర్శించొచ్చు.. వసతి, ఆహారం అన్ని ఈ బడ్జెట్లోనే!
- థాయ్లాండ్ను సందర్శించాలనుంటున్నారా?
- ఐఆర్సీటీసీ చక్కని అవకాశం కల్పించింది
- రూ.50 వేల బడ్జెట్లోనే థాయ్లాండ్ వెళ్లి రావచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand: థాయిలాండ్ చాలా అందమైన ప్రదేశం. చాలా మంది ఇక్కడకు వెళ్లి ఎంజాయ్ చేయాలని కలలు కంటుంటారు. చాలా మంది బడ్జెట్ కారణంగా థాయ్లాండ్ వెళ్లాలంటే భయపడుతారు. ఇప్పుడు ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు థాయ్లాండ్ పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు. కేవలం రూ.50 వేలలోనే థాయ్లాండ్లో పర్యటించి తిరిగి రావచ్చు. నిజమేనండోయ్.. ఐఆర్సీటీసీ ఈ అవకాశాన్ని కల్పించింది. మీ భాగస్వామి లేదా స్నేహితులతో వెళ్లాలనుకుంటే ఇదే చక్కని అవకాశం. ఈ బడ్జెట్లోనే థాయ్లాండ్ వెళ్లి రావడంతో పాటు భోజనం, వసతి కల్పిస్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్లో థాయ్లాండ్ను సందర్శించే అవకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది.
Read Also: NEET-UG 2024: నీట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా..!
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
*ప్యాకేజీ పేరు- ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్
*ప్యాకేజీ వ్యవధి- 3 రాత్రులు, 4 రోజులు
*ప్రయాణ విధానం- ఫ్లైట్
*సందర్శించే స్థలాలు- బ్యాంకాక్, పట్టాయా
*పర్యటన ఎక్కడ నుంచి ప్రారంభం- హైదరాబాద్
ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి
1. మీరు రౌండ్ ట్రిప్ ఫ్లైట్ కోసం ఎకానమీ క్లాస్ టికెట్ పొందుతారు.
2. బస చేయడానికి హోటల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
3. ఈ టూర్ ప్యాకేజీలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం అందుబాటులో ఉంటుంది.
4. మీకు ప్రయాణ బీమా సౌకర్యం కూడా లభిస్తుంది.
ప్రయాణానికి ఇంత మొత్తం వసూలు చేస్తారు
1. ఈ ట్రిప్లో ఒంటరిగా ప్రయాణిస్తే రూ.57,820 చెల్లించాల్సి ఉంటుంది.
2. ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరికి రూ.49,450 చెల్లించాల్సి ఉంటుంది.
3. ముగ్గురు వ్యక్తులు అయితే ఒక్కొక్కరికి రూ.49,450 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
4. మీరు పిల్లలకు ప్రత్యేక ఫీజు చెల్లించాలి. బెడ్తో (5-11 ఏళ్లు) రూ.47,440, బెడ్ లేకుండా రూ.42,420 చెల్లించాల్సి ఉంటుంది.
ఐఆర్సీటీసీ(IRCTC) ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది
ఐఆర్సీటీసీ(IRCTC)ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్ను షేర్ చేసింది. ఇందులో మీరు థాయిలాండ్ అందమైన దృశ్యాలను చూడాలనుకుంటే, మీరు ఐఆర్సీటీసీ యొక్క ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. జులై 25వ తేదీ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.49,450 అని ప్రకటించింది. బ్యాంకాక్, పట్టాయా అందాలను సందర్శించాలంటే ఇప్పుడే బుక్ చేసుకోవాలని ఐఆర్సీటీసీ పేర్కొంది.
మీరు ఇలా బుక్ చేసుకోవచ్చు
మీరు IRCTC అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం, మీరు IRCTC అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
- Tags
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!