Thailand: రూ.50 వేలతో థాయ్లాండ్ను సందర్శించొచ్చు.. వసతి, ఆహారం అన్ని ఈ బడ్జెట్లోనే!
- థాయ్లాండ్ను సందర్శించాలనుంటున్నారా?
- ఐఆర్సీటీసీ చక్కని అవకాశం కల్పించింది
- రూ.50 వేల బడ్జెట్లోనే థాయ్లాండ్ వెళ్లి రావచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand: థాయిలాండ్ చాలా అందమైన ప్రదేశం. చాలా మంది ఇక్కడకు వెళ్లి ఎంజాయ్ చేయాలని కలలు కంటుంటారు. చాలా మంది బడ్జెట్ కారణంగా థాయ్లాండ్ వెళ్లాలంటే భయపడుతారు. ఇప్పుడు ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు థాయ్లాండ్ పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు. కేవలం రూ.50 వేలలోనే థాయ్లాండ్లో పర్యటించి తిరిగి రావచ్చు. నిజమేనండోయ్.. ఐఆర్సీటీసీ ఈ అవకాశాన్ని కల్పించింది. మీ భాగస్వామి లేదా స్నేహితులతో వెళ్లాలనుకుంటే ఇదే చక్కని అవకాశం. ఈ బడ్జెట్లోనే థాయ్లాండ్ వెళ్లి రావడంతో పాటు భోజనం, వసతి కల్పిస్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్లో థాయ్లాండ్ను సందర్శించే అవకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది.
Read Also: NEET-UG 2024: నీట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా..!
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
*ప్యాకేజీ పేరు- ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్
*ప్యాకేజీ వ్యవధి- 3 రాత్రులు, 4 రోజులు
*ప్రయాణ విధానం- ఫ్లైట్
*సందర్శించే స్థలాలు- బ్యాంకాక్, పట్టాయా
*పర్యటన ఎక్కడ నుంచి ప్రారంభం- హైదరాబాద్
ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి
1. మీరు రౌండ్ ట్రిప్ ఫ్లైట్ కోసం ఎకానమీ క్లాస్ టికెట్ పొందుతారు.
2. బస చేయడానికి హోటల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
3. ఈ టూర్ ప్యాకేజీలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం అందుబాటులో ఉంటుంది.
4. మీకు ప్రయాణ బీమా సౌకర్యం కూడా లభిస్తుంది.
ప్రయాణానికి ఇంత మొత్తం వసూలు చేస్తారు
1. ఈ ట్రిప్లో ఒంటరిగా ప్రయాణిస్తే రూ.57,820 చెల్లించాల్సి ఉంటుంది.
2. ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరికి రూ.49,450 చెల్లించాల్సి ఉంటుంది.
3. ముగ్గురు వ్యక్తులు అయితే ఒక్కొక్కరికి రూ.49,450 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
4. మీరు పిల్లలకు ప్రత్యేక ఫీజు చెల్లించాలి. బెడ్తో (5-11 ఏళ్లు) రూ.47,440, బెడ్ లేకుండా రూ.42,420 చెల్లించాల్సి ఉంటుంది.
ఐఆర్సీటీసీ(IRCTC) ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది
ఐఆర్సీటీసీ(IRCTC)ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్ను షేర్ చేసింది. ఇందులో మీరు థాయిలాండ్ అందమైన దృశ్యాలను చూడాలనుకుంటే, మీరు ఐఆర్సీటీసీ యొక్క ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. జులై 25వ తేదీ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.49,450 అని ప్రకటించింది. బ్యాంకాక్, పట్టాయా అందాలను సందర్శించాలంటే ఇప్పుడే బుక్ చేసుకోవాలని ఐఆర్సీటీసీ పేర్కొంది.
మీరు ఇలా బుక్ చేసుకోవచ్చు
మీరు IRCTC అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం, మీరు IRCTC అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
- Tags
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!