Thailand: రూ.50 వేలతో థాయ్లాండ్ను సందర్శించొచ్చు.. వసతి, ఆహారం అన్ని ఈ బడ్జెట్లోనే!
- థాయ్లాండ్ను సందర్శించాలనుంటున్నారా?
- ఐఆర్సీటీసీ చక్కని అవకాశం కల్పించింది
- రూ.50 వేల బడ్జెట్లోనే థాయ్లాండ్ వెళ్లి రావచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand: థాయిలాండ్ చాలా అందమైన ప్రదేశం. చాలా మంది ఇక్కడకు వెళ్లి ఎంజాయ్ చేయాలని కలలు కంటుంటారు. చాలా మంది బడ్జెట్ కారణంగా థాయ్లాండ్ వెళ్లాలంటే భయపడుతారు. ఇప్పుడు ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు థాయ్లాండ్ పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు. కేవలం రూ.50 వేలలోనే థాయ్లాండ్లో పర్యటించి తిరిగి రావచ్చు. నిజమేనండోయ్.. ఐఆర్సీటీసీ ఈ అవకాశాన్ని కల్పించింది. మీ భాగస్వామి లేదా స్నేహితులతో వెళ్లాలనుకుంటే ఇదే చక్కని అవకాశం. ఈ బడ్జెట్లోనే థాయ్లాండ్ వెళ్లి రావడంతో పాటు భోజనం, వసతి కల్పిస్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్లో థాయ్లాండ్ను సందర్శించే అవకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది.
Read Also: NEET-UG 2024: నీట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా..!
Also Read
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- 8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
*ప్యాకేజీ పేరు- ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్
*ప్యాకేజీ వ్యవధి- 3 రాత్రులు, 4 రోజులు
*ప్రయాణ విధానం- ఫ్లైట్
*సందర్శించే స్థలాలు- బ్యాంకాక్, పట్టాయా
*పర్యటన ఎక్కడ నుంచి ప్రారంభం- హైదరాబాద్
ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి
1. మీరు రౌండ్ ట్రిప్ ఫ్లైట్ కోసం ఎకానమీ క్లాస్ టికెట్ పొందుతారు.
2. బస చేయడానికి హోటల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
3. ఈ టూర్ ప్యాకేజీలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం అందుబాటులో ఉంటుంది.
4. మీకు ప్రయాణ బీమా సౌకర్యం కూడా లభిస్తుంది.
ప్రయాణానికి ఇంత మొత్తం వసూలు చేస్తారు
1. ఈ ట్రిప్లో ఒంటరిగా ప్రయాణిస్తే రూ.57,820 చెల్లించాల్సి ఉంటుంది.
2. ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరికి రూ.49,450 చెల్లించాల్సి ఉంటుంది.
3. ముగ్గురు వ్యక్తులు అయితే ఒక్కొక్కరికి రూ.49,450 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
4. మీరు పిల్లలకు ప్రత్యేక ఫీజు చెల్లించాలి. బెడ్తో (5-11 ఏళ్లు) రూ.47,440, బెడ్ లేకుండా రూ.42,420 చెల్లించాల్సి ఉంటుంది.
ఐఆర్సీటీసీ(IRCTC) ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది
ఐఆర్సీటీసీ(IRCTC)ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్ను షేర్ చేసింది. ఇందులో మీరు థాయిలాండ్ అందమైన దృశ్యాలను చూడాలనుకుంటే, మీరు ఐఆర్సీటీసీ యొక్క ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. జులై 25వ తేదీ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.49,450 అని ప్రకటించింది. బ్యాంకాక్, పట్టాయా అందాలను సందర్శించాలంటే ఇప్పుడే బుక్ చేసుకోవాలని ఐఆర్సీటీసీ పేర్కొంది.
మీరు ఇలా బుక్ చేసుకోవచ్చు
మీరు IRCTC అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం, మీరు IRCTC అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
- Tags
తాజావార్తలు
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
-
Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
-
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్కు చావోరేవో.. ప్లేఆఫ్స్కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!