Pawan Kalyan: అత్యంత ధైర్యవంతమైన నిర్ణయం.. డిప్యూటీ సీఎం పవన్ పోస్ట్ వైరల్!
- 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు
- ఆర్టికల్ 370 రద్దుకు నేటితో ఆరేళ్లు
- జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజలకు పవన్ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Tweet on Article 370 6th Anniversary: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ‘ఆర్టికల్ 370’ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 2019 ఆగస్టు 5న ఈ అధికరణను నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా (జమ్మూ కశ్మీర్, లడఖ్) విభజించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుకు నేటితో ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.
‘ఒక చారిత్రాత్మక రాజ్యాంగ తప్పిదానికి పరిష్కారం చూపిన రోజు. భారత యూనియన్లో జమ్మూ కశ్మీర్కు పూర్తిగా, న్యాయబద్ధంగా ఏకీకరణకు హామీ ఇచ్చిన రోజు. చాలా కాలంగా అశాంతి, హింసతో ప్రభావితమైన ఈ ప్రాంతానికి శాంతిని తీసుకువచ్చి.. ప్రజలకు సమానత్వం, అభివృద్ధికి మార్గాన్ని తెరిచిన రోజు. దేశ నిర్మాణంలో నిర్ణయాత్మక, దార్శనిక నాయకత్వ బలాన్ని చూపించిన రోజు. 2019 ఆగస్టు 5న ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్లో దశాబ్దాల అశాంతి ముగిసింది. దేశవ్యాప్తంగా పౌరులతో సమానంగా జమ్మూ కశ్మీర్ ప్రజలకు సమాన హక్కులను నిర్ధారించడం ద్వారా చారిత్రాత్మక అడుగు వేసింది. దశాబ్దాలుగా ఉగ్రవాదం, హింస కాశ్మీర్ యువత ఆకాంక్షలను అణచివేసాయి. ఆర్టికల్ 370 రద్దుతో శాంతికి, సమగ్ర అభివృద్ధికి నాంది.జమ్మూ కశ్మీర్కు పూర్తి రాజ్యాంగ హక్కులు కల్పించిన రోజు. 6వ వార్షికోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
Also Read: Vivo T4R 5G Price: ‘వివో టీ4ఆర్’ అమ్మకాలు షురూ.. 4 వేల లాంచింగ్ ఆఫర్!
ఇక జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశం కావడంతో ఈ చర్చ మొదలైంది. రాష్ట్రపతితో భేటీ తర్వాత అమిత్ షా జమ్మూ కశ్మీర్ నేతలను కలిశారు. దాంతో జమ్మూ కశ్మీర్పైనే సమావేశం అయ్యారనే జరిగాయనే ప్రచారం ఊపందుకుంది. అయితే సీఎం ఒమర్ అబ్దుల్లా మాత్రం వందతులను ఖండించారు. తనకైతే నమ్మకం లేదని, ఏమీ జరగదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా అని తెలిపారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!