Pawan Kalyan : వైసీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే.. ఈనేపథ్యంలో ఇప్పటం గ్రామస్తులకు చెక్కుల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ఇటీవల ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతతో నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరూ వెనకడుగు వేసిన సందర్భంలో ఇప్పటం గ్రామమే జనసేనకు అండగా నిలబడిందని, రాష్ట్ర భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఇప్పటం గ్రామం ఇచ్చిందన్నారు. ఇప్పటం గ్రామస్తుల గడపలు కూల్చిన వైసీపీ గడప కూల్చే వరకు పోరాటం చేస్తామని, రోడ్ల విస్తరణ చేస్తే అన్ని ఇళ్లు కూల్చాలి.. కానీ కొందరివే ఎందుకు కూల్చారన్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటం గ్రామస్తులు తెగువ అమరావతి ప్రజలు చూపించి ఉంటే.. అమరావతి వెళ్లేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ఇప్పటం గ్రామానికైన గాయానికి జనసేన మందు రాస్తుంది. ప్రజల గుండెల్లో స్థానం కంటే ఏ ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదు.
Also Read : Ind vs Nz: రెండో వన్డే వర్షార్పణం.. 1-0 ఆధిక్యంలో కివీస్
వైసీపీ 30 ఏళ్ల అధికారంలో ఉండాలని కోరుకుంటే నేను 30 ఏళ్లల్లో ప్రజలు ఎదగాలని కోరుకుంటా. ఇప్పటం గ్రామంలో కూల్చివేతలు వెనుక డిఫ్యాక్టో సీఎం సజ్జల ఉన్నారు. అధికారం అంటే అహంకారం కాదని సజ్జల తెలుసుకోవాలి. రేపటి నుంచి నన్ను తిట్టిస్తారా నాపై దాడులు చేయిస్తారా చేయించుకోండి నేను బెదరను. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వైసీపీ నేతల ఇళ్లూ కూలుస్తాం. లీగలుగా ఎలా కూల్చాలో మీరు చెప్పారుగా.. మేమూ లీగలుగానే చేస్తాం. కోడి కత్తితో గీకుంచుకుని రాజకీయ డ్రామాలు చేయటం వైసీపీ పని. వైసీపీకి సంస్కారవంతమైన రాజకీయాలు పని చేయవు. వివేకాను హత్య చేయించిన వారిని తమ వెనుక తిప్పుకుంటున్న వారు కూడా జనసేనను రౌడీ సేన అంటున్నారు. మాది రౌడీ సేన కాదు.. విప్లవ సేన. ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో మేం చూపిస్తాం. ప్రభుత్వం దృష్టిలో మేం రౌడీలమేమో కానీ.. ప్రజల దృష్టిలో మేం విప్లవ వీరులం. అనంతలో వైసీపీ నేతలు ఎలా మాట్లాడుతున్నారో.. మీడియాలో చూస్తున్నా. వైసీపీ నేతలా..? వైసీపీ టెర్రరిస్టులా..? రాజకీయం మీరే చేయాలా..? మేం చేయకూడదా..? వైసీపీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొడతాం’ అంటూ ధ్వజమెత్తారు పవన్ కల్యాణ్.
Also Read
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!