Pawan Kalyan: 2019లో పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఆలోచించాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నుంచి జనసేనలోకి వివిధ పార్టీల నేతలు చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక, పిఠాపురంలో మిథున్ రెడ్డి బాగా తిరుగుతున్నారటగా అంటూ పవన్ సెటైర్లు వేశారు. కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురం నుంచి గతంలోనే పోటీ చేయాలని చాలా మంది ఆహ్వానించారు.. కానీ, ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాన్నారు. 2019 లోనే పోటీ చేయమంటే నేను ఆలోచించాను.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే పిఠాపురం ప్రత్యేకమైనది అని ఆయన చెప్పుకొచ్చారు. పిఠాపురంలో కులాల ఐక్యత జరగాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: Prince William: మాజీ మోడల్ మాయలో విలియం పడ్డారా? ఎఫైర్పై క్లారిటీ!
Also Read
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
- SS Rajamouli: "ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది".. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
- 55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని భావించేవాడిని అని జనసేన ఛీప్ పవన్ అన్నారు. గాజువాక, భీమవరం, పిఠాపురం మూడు నియోజకవర్గాలు నాకు మూడు కళ్లు.. నా గెలుపు కోసం ఆలోచన చేయకుండా.. రాష్ట్రం కోసం నేను ఆలోచన చేశాను.. శ్రీపాద శ్రీ వల్లభుడి కటాక్షంతో మనకి మంచే జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని నా స్వస్థలంగా మార్చుకుంటాను.. నేను ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఇక నుంచి పిఠాపురం నుంచే ఏపీ భవిష్యత్ దశ దిశ మార్చేలా చేస్తాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: India Growth: భారత వృద్ధి 8 శాతం పైమాటే.. ఆర్బీఐ కథనం..
బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని నన్ను అడిగింది అనే విషయాన్న పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంపీగా పోటీ చేస్తారా..? లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని అడిగారు.. ఎమ్మెల్యేగానే పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాను.. ముందు రాష్ట్రం, ఆ తర్వాత దేశానికి సేవ చేయాలని చెప్పా.. నా కోసం త్యాగం చేసిన ఉదయ్ ను కాకినాడ ఎంపీగా పంపిస్తున్నాను.. వందల కోట్లు పెట్టి నన్ను ఓడించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. అందరి ఆశీస్సులుంటే జగన్ లక్ష రూపాయలిచ్చినా ఏం కాదు.. 2009లో వంగా గీత పీఆర్పీ నుంచే గెలిచారు అని ఆయన తెలిపారు. దురదృష్టవశాత్తూ ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు.. ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నాను అని పవన్ అన్నారు.
Read Also: Raw Mango: పచ్చిమామిడి తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..!
పిఠాపురాన్ని ఏపీలో ఆదర్శ నియోజకవర్గం చేద్దాం.. ఇక్కడ విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే తలచుకుంటే అభివృద్ధి ఎలా చేయొచ్చో చూపిస్తాను అని తెలిపారు. ఎంతటి తీవ్రమైన సమస్యనైనా తగ్గించటానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ఈ సమాజాన్ని కలిపే వ్యక్తిని, విడదీసే వ్యక్తిని కాదు.. మీ అందరి సహకారం, దీవెనలు కావాలి.. వ్యవస్థపై కోపంతో ఎవరూ నోటాకు ఓటు వేయొద్దని కోరుతున్నాను.. అలాంటి వారు జనసేనకు ఓటేస్తే ఉపయోగపడుతుంది అని జనసేన ఛీప్ పవన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!