Pawan Kalyan: 2019లో పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఆలోచించాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నుంచి జనసేనలోకి వివిధ పార్టీల నేతలు చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక, పిఠాపురంలో మిథున్ రెడ్డి బాగా తిరుగుతున్నారటగా అంటూ పవన్ సెటైర్లు వేశారు. కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురం నుంచి గతంలోనే పోటీ చేయాలని చాలా మంది ఆహ్వానించారు.. కానీ, ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాన్నారు. 2019 లోనే పోటీ చేయమంటే నేను ఆలోచించాను.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే పిఠాపురం ప్రత్యేకమైనది అని ఆయన చెప్పుకొచ్చారు. పిఠాపురంలో కులాల ఐక్యత జరగాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: Prince William: మాజీ మోడల్ మాయలో విలియం పడ్డారా? ఎఫైర్పై క్లారిటీ!
Also Read
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని భావించేవాడిని అని జనసేన ఛీప్ పవన్ అన్నారు. గాజువాక, భీమవరం, పిఠాపురం మూడు నియోజకవర్గాలు నాకు మూడు కళ్లు.. నా గెలుపు కోసం ఆలోచన చేయకుండా.. రాష్ట్రం కోసం నేను ఆలోచన చేశాను.. శ్రీపాద శ్రీ వల్లభుడి కటాక్షంతో మనకి మంచే జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని నా స్వస్థలంగా మార్చుకుంటాను.. నేను ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఇక నుంచి పిఠాపురం నుంచే ఏపీ భవిష్యత్ దశ దిశ మార్చేలా చేస్తాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: India Growth: భారత వృద్ధి 8 శాతం పైమాటే.. ఆర్బీఐ కథనం..
బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని నన్ను అడిగింది అనే విషయాన్న పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంపీగా పోటీ చేస్తారా..? లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని అడిగారు.. ఎమ్మెల్యేగానే పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాను.. ముందు రాష్ట్రం, ఆ తర్వాత దేశానికి సేవ చేయాలని చెప్పా.. నా కోసం త్యాగం చేసిన ఉదయ్ ను కాకినాడ ఎంపీగా పంపిస్తున్నాను.. వందల కోట్లు పెట్టి నన్ను ఓడించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. అందరి ఆశీస్సులుంటే జగన్ లక్ష రూపాయలిచ్చినా ఏం కాదు.. 2009లో వంగా గీత పీఆర్పీ నుంచే గెలిచారు అని ఆయన తెలిపారు. దురదృష్టవశాత్తూ ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు.. ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నాను అని పవన్ అన్నారు.
Read Also: Raw Mango: పచ్చిమామిడి తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..!
పిఠాపురాన్ని ఏపీలో ఆదర్శ నియోజకవర్గం చేద్దాం.. ఇక్కడ విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే తలచుకుంటే అభివృద్ధి ఎలా చేయొచ్చో చూపిస్తాను అని తెలిపారు. ఎంతటి తీవ్రమైన సమస్యనైనా తగ్గించటానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ఈ సమాజాన్ని కలిపే వ్యక్తిని, విడదీసే వ్యక్తిని కాదు.. మీ అందరి సహకారం, దీవెనలు కావాలి.. వ్యవస్థపై కోపంతో ఎవరూ నోటాకు ఓటు వేయొద్దని కోరుతున్నాను.. అలాంటి వారు జనసేనకు ఓటేస్తే ఉపయోగపడుతుంది అని జనసేన ఛీప్ పవన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!