Pawan Kalyan: ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ఎమ్మెల్యేలను నిలదీయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అవినీతి చదివేకొద్దీ తన కళ్ల సైట్ పెరిగిందని పవన్ అన్నారు. రాజోలు విజయం గాయపడ్డ గుండెకు సేదతీరినట్లయిందని, రాజోలులో వెలిగించిన చిరుదీపం.. రౌడీలు, దౌర్జన్యాల పాలిట అఖండజ్యోతి అవుతుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కులాల మధ్య చిచ్చుపెట్టడానికి తాను రాలేదని, కులాలను కలపడానికి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. మలికిపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్పై పవన్ ఫైర్ అయ్యారు. బోటు అనే మా ఓట్లపై గెలిచి తెప్పదాటిన తరువాత మాపై దూషిస్తే ఊరుకోమన్నారు. 151 వైసీపీ ఎమ్మెల్యేలకు రాజోలు ఒక సమాధానమైందన్నారు. రాజోలు ప్రజలు అందించిన విజయం ఓయాసిస్లా పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యే కావాలని పోటీ పడండి. మనలో మనం కొట్టుకుంటూ పార్టీని నట్టేట ముంచవద్దని నేతలకు సూచించారు. మన గెలుపు ప్రజల గెలుపు కావాలన్నారు.
Also Read: Modi Egypt Visit : భారత్, ఈజిప్ట్ మధ్య ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’.. ఎంఓయూపై సంతకాలు
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
కోనసీమ ప్రాంతం ఎందుకు కాలుష్యానికి గురైందని.. ఏటిగట్టులు ఎందుకు పటిష్టపర్చలేదని ? మల్కిపురంకు చిన్నపాటి స్మశాన వాటిక ఎందుకు లేదని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే ఎమ్మెల్యేలను నిలదీయాలని ప్రజలకు సూచించారు. 12 రోజులుగా సాగుతున్న వారాహి మొదటి దశ యాత్ర ఈరోజుతో ముగిసిందన్నారు. మొదటి దశ 8 నియోజకవర్గాల్లో పూర్తి చేశామన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానేయాలని.. విద్య, వైద్యం సంపూర్ణంగా అందించే వారిని గెలిపించాలని సూచించారు. ఇలా మాట్లాడితే ఓట్లు పడతాయని నాకు లేదని.. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను వ్యతిరేకమని పవన్ అన్నారు. మలికిపురం బైపాస్ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో రోడ్డు వేయకపోతే శ్రమదానం చేపట్టి తామే వేస్తామన్నారు. సఖినేటిపల్లి – నర్సాపురం వంతెన ఎందుకు నిర్మించడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపనలు చేసినా ఇప్పటికీ ఎందుకు నిర్మాణం చేపట్టలేదని పవన్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!