Pawan Kalyan: వైసీపీని ఓడించి తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కసారి ఛాన్స్ అడిగితే ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం ఛాన్స్ తీసుకోండని అన్నారు. వైసీపీని ఓడించి అప్పుడు తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలని తెలిపారు. లే అవుట్లు వేయాలన్నా.. ఇళ్ళు కట్టాలన్నా వైసీపీ వాళ్లకు లంచాలు ఇవ్వాలని చెప్పారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాల బాబు అని విమర్శించారు. సింహాచలం భూమి ఆక్రమించి ఎమ్మెల్యే భారీ భవంతి కడితే అడిగే దిక్కు లేదని పేర్కొన్నారు. కన్నబాబు రాజు లాంటి ఎమ్మేల్యేలు అధికారంలో ఉంటే ఎన్ని రాజ్యాంగాలు ఉన్నా న్యాయం జరగదని పవన్ కల్యాణ్ తెలిపారు.
Maldives: మాల్దీవుల్లో పెరుగుతున్న మతోన్మాదం.. ఇద్దరు భారతీయులు, ఇజ్రాయిల్ యువతిపై దాడి..
Also Read
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
కూటమి అభ్యర్థులను గెలిపించండి.. వాళ్ళంతా బాధ్యతా యుతంగా ఉండేలా చూసే బాధ్యత తనదని అన్నారు. దోపిడీ దారుడుతో పోరాటం కోసం ప్రజల గుండె చప్పుడు అయ్యాను.. జనసేనను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా మార్చడం మన మొదటి పని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ తర్వాత సీఎం అవడం కాలం నిర్ణయిస్తుంది.. అప్పటి వరకు ప్రజల తరపున ముఠా కూలీగా పనిచేస్తానని భరోసానిచ్చారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీలో తొలిసారి స్కిల్ గణాంకాలు తీసుకుని వాటి ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
Pushpa 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న పుష్ప2 మాస్ టైటిల్ సాంగ్..
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ రాబోతోందని పవన్ కల్యాణ్ చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని విమర్శించారు. అన్ని చట్టాలు ఉంటేనే భూములు కబ్జాలు ఆగడం లేదు.. టైటిలింగ్ యాక్ట్ వస్తే నష్టం తప్పదని సూచించారు. వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నీ గాలిలో దీపం లాంటిదని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా చేసే వాళ్ళను మొకాళ్ళ మీద కూర్చోబెడదామన్నారు. లా& ఆర్డర్ పరిరక్షణ కూటమి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చెందాల్సిన సహజవనరులు దోపిడీకి గురయ్యాయని.. భవిష్యత్ తమదేనని పవన్ కల్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!