Pawan Kalyan: వైసీపీని ఓడించి తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కసారి ఛాన్స్ అడిగితే ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం ఛాన్స్ తీసుకోండని అన్నారు. వైసీపీని ఓడించి అప్పుడు తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలని తెలిపారు. లే అవుట్లు వేయాలన్నా.. ఇళ్ళు కట్టాలన్నా వైసీపీ వాళ్లకు లంచాలు ఇవ్వాలని చెప్పారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాల బాబు అని విమర్శించారు. సింహాచలం భూమి ఆక్రమించి ఎమ్మెల్యే భారీ భవంతి కడితే అడిగే దిక్కు లేదని పేర్కొన్నారు. కన్నబాబు రాజు లాంటి ఎమ్మేల్యేలు అధికారంలో ఉంటే ఎన్ని రాజ్యాంగాలు ఉన్నా న్యాయం జరగదని పవన్ కల్యాణ్ తెలిపారు.
Maldives: మాల్దీవుల్లో పెరుగుతున్న మతోన్మాదం.. ఇద్దరు భారతీయులు, ఇజ్రాయిల్ యువతిపై దాడి..
Also Read
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
కూటమి అభ్యర్థులను గెలిపించండి.. వాళ్ళంతా బాధ్యతా యుతంగా ఉండేలా చూసే బాధ్యత తనదని అన్నారు. దోపిడీ దారుడుతో పోరాటం కోసం ప్రజల గుండె చప్పుడు అయ్యాను.. జనసేనను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా మార్చడం మన మొదటి పని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ తర్వాత సీఎం అవడం కాలం నిర్ణయిస్తుంది.. అప్పటి వరకు ప్రజల తరపున ముఠా కూలీగా పనిచేస్తానని భరోసానిచ్చారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీలో తొలిసారి స్కిల్ గణాంకాలు తీసుకుని వాటి ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
Pushpa 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న పుష్ప2 మాస్ టైటిల్ సాంగ్..
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ రాబోతోందని పవన్ కల్యాణ్ చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని విమర్శించారు. అన్ని చట్టాలు ఉంటేనే భూములు కబ్జాలు ఆగడం లేదు.. టైటిలింగ్ యాక్ట్ వస్తే నష్టం తప్పదని సూచించారు. వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నీ గాలిలో దీపం లాంటిదని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా చేసే వాళ్ళను మొకాళ్ళ మీద కూర్చోబెడదామన్నారు. లా& ఆర్డర్ పరిరక్షణ కూటమి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చెందాల్సిన సహజవనరులు దోపిడీకి గురయ్యాయని.. భవిష్యత్ తమదేనని పవన్ కల్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
December Clash : డిసెంబర్ రేస్లో రెబల్ స్టార్ vs కింగ్ ఖాన్
-
FIFA World Cup 2026 Awards List: ఫిఫా వరల్డ్ కప్ అవార్డుల జాబితా.. అన్ని ప్రధాన వ్యక్తిగత అవార్డులు స్పెయిన్కే
-
Hi Movie OTT: నయనతార ‘హాయ్’ మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!