Maldives: మాల్దీవుల్లో పెరుగుతున్న మతోన్మాదం.. ఇద్దరు భారతీయులు, ఇజ్రాయిల్ యువతిపై దాడి..
Maldives: ద్వీపదేశం మాల్దీవుల్లో క్రమంగా ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరుగుతోంది. ఇటీవల పలు పరిణామాలు ఆ దేశంలో పెరుగుతున్న మతోన్మాదాన్ని సూచిస్తున్నాయి. భారత్ అంటే తీవ్ర వ్యతిరేకతతో పాటు ఇజ్రాయిల్పై ఆ దేశం ఆగ్రహంతో ఉంది. గాజా యుద్ధం తర్వాత ఇది మరింత పెరిగింది.. మాల్దీవుల పార్లమెంట్ ఇటీవల పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానం ఇజ్రాయిల్ పాస్పోర్టులు ఉన్న వారిని రాకను, ఇజ్రాయిల్ తయారు చేసిన వస్తువుల దిగుమతిని నిషేధిస్తుంది.
మరోవైపు, సోమవారం రాజధాని మాలేకి 7 కి.మీ దూరంలో ఉన్న హుల్హుమలేలోని సెంట్రల్ పార్క్ సమీపంలో మాల్దీవుల్లోని స్థానిక ప్రజలు, ఇద్దరు భారతీయులకు మధ్య జరిగిన వాగ్వాదం దాడిగా మారింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
Read Also: Crying Benefits: నవ్వడం వల్ల మాత్రమే కాదు.. ఏడిస్తే కూడా ఎన్నో లాభాలు!
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇజ్రాయిల్ మహిళా టూరిస్టుపై స్థానిక ప్రజలు వేధించారు. ఏప్రిల్ 30న ఓ ద్వీపం నుంచి ఆమెను తరిమికొట్టారు. దీనిని ఆ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు మహ్మద్ జాకీ గర్వంగా షేర్ చేశాడు. ‘‘ఇజ్రాయిల్ దేశం మారణహోమం చేస్తున్న సమయంలో ఆ దేశానికి చెందిన ఓ టూరిస్టు ద్వీపంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఆమెను స్థానికులు తన్నితరిమేశారు. ఆమె ప్రస్తుతం ఎయిర్ పోర్టు వెళ్లే మార్గంలో ఉంది. మానవత్వం ఇకపై వారిని స్వాగతించదు’’ అని ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే ఆ దేశంలో ఇటీవల తీవ్రవాదం పెరుగుతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే కాకుండా పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబాలు మాల్దీవుల్లో తిష్టవేశాయి. 2014-18న మధ్య ఇస్లామిక్ స్టేట్ కోసం పోరాడేందుకు 5 లక్షల మంది ఉన్న మాల్దీవుల నుంచి 250 మంది పోరాడటానికి వెళ్లారు. ఇందులో చాలా మంది చనిపోయారు. నివేదికల ప్రకారం 2004 సునామీ తర్వాత మాల్దీవుల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరిగింది.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?