Maldives: మాల్దీవుల్లో పెరుగుతున్న మతోన్మాదం.. ఇద్దరు భారతీయులు, ఇజ్రాయిల్ యువతిపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: ద్వీపదేశం మాల్దీవుల్లో క్రమంగా ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరుగుతోంది. ఇటీవల పలు పరిణామాలు ఆ దేశంలో పెరుగుతున్న మతోన్మాదాన్ని సూచిస్తున్నాయి. భారత్ అంటే తీవ్ర వ్యతిరేకతతో పాటు ఇజ్రాయిల్పై ఆ దేశం ఆగ్రహంతో ఉంది. గాజా యుద్ధం తర్వాత ఇది మరింత పెరిగింది.. మాల్దీవుల పార్లమెంట్ ఇటీవల పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానం ఇజ్రాయిల్ పాస్పోర్టులు ఉన్న వారిని రాకను, ఇజ్రాయిల్ తయారు చేసిన వస్తువుల దిగుమతిని నిషేధిస్తుంది.
మరోవైపు, సోమవారం రాజధాని మాలేకి 7 కి.మీ దూరంలో ఉన్న హుల్హుమలేలోని సెంట్రల్ పార్క్ సమీపంలో మాల్దీవుల్లోని స్థానిక ప్రజలు, ఇద్దరు భారతీయులకు మధ్య జరిగిన వాగ్వాదం దాడిగా మారింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
- Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
Read Also: Crying Benefits: నవ్వడం వల్ల మాత్రమే కాదు.. ఏడిస్తే కూడా ఎన్నో లాభాలు!
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇజ్రాయిల్ మహిళా టూరిస్టుపై స్థానిక ప్రజలు వేధించారు. ఏప్రిల్ 30న ఓ ద్వీపం నుంచి ఆమెను తరిమికొట్టారు. దీనిని ఆ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు మహ్మద్ జాకీ గర్వంగా షేర్ చేశాడు. ‘‘ఇజ్రాయిల్ దేశం మారణహోమం చేస్తున్న సమయంలో ఆ దేశానికి చెందిన ఓ టూరిస్టు ద్వీపంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఆమెను స్థానికులు తన్నితరిమేశారు. ఆమె ప్రస్తుతం ఎయిర్ పోర్టు వెళ్లే మార్గంలో ఉంది. మానవత్వం ఇకపై వారిని స్వాగతించదు’’ అని ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే ఆ దేశంలో ఇటీవల తీవ్రవాదం పెరుగుతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే కాకుండా పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబాలు మాల్దీవుల్లో తిష్టవేశాయి. 2014-18న మధ్య ఇస్లామిక్ స్టేట్ కోసం పోరాడేందుకు 5 లక్షల మంది ఉన్న మాల్దీవుల నుంచి 250 మంది పోరాడటానికి వెళ్లారు. ఇందులో చాలా మంది చనిపోయారు. నివేదికల ప్రకారం 2004 సునామీ తర్వాత మాల్దీవుల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరిగింది.
తాజావార్తలు
-
Saroj Khan: మాధురీని ఉదాహరణగా చూపిస్తూ.. కరిష్మాపై ఫైర్ అయిన సరోజ్ ఖాన్..
-
Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. సీఎస్కే, ఎంఐ కాదు టాప్లో కేకేఆర్!
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?