Maldives: మాల్దీవుల్లో పెరుగుతున్న మతోన్మాదం.. ఇద్దరు భారతీయులు, ఇజ్రాయిల్ యువతిపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: ద్వీపదేశం మాల్దీవుల్లో క్రమంగా ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరుగుతోంది. ఇటీవల పలు పరిణామాలు ఆ దేశంలో పెరుగుతున్న మతోన్మాదాన్ని సూచిస్తున్నాయి. భారత్ అంటే తీవ్ర వ్యతిరేకతతో పాటు ఇజ్రాయిల్పై ఆ దేశం ఆగ్రహంతో ఉంది. గాజా యుద్ధం తర్వాత ఇది మరింత పెరిగింది.. మాల్దీవుల పార్లమెంట్ ఇటీవల పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానం ఇజ్రాయిల్ పాస్పోర్టులు ఉన్న వారిని రాకను, ఇజ్రాయిల్ తయారు చేసిన వస్తువుల దిగుమతిని నిషేధిస్తుంది.
మరోవైపు, సోమవారం రాజధాని మాలేకి 7 కి.మీ దూరంలో ఉన్న హుల్హుమలేలోని సెంట్రల్ పార్క్ సమీపంలో మాల్దీవుల్లోని స్థానిక ప్రజలు, ఇద్దరు భారతీయులకు మధ్య జరిగిన వాగ్వాదం దాడిగా మారింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
Read Also: Crying Benefits: నవ్వడం వల్ల మాత్రమే కాదు.. ఏడిస్తే కూడా ఎన్నో లాభాలు!
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇజ్రాయిల్ మహిళా టూరిస్టుపై స్థానిక ప్రజలు వేధించారు. ఏప్రిల్ 30న ఓ ద్వీపం నుంచి ఆమెను తరిమికొట్టారు. దీనిని ఆ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు మహ్మద్ జాకీ గర్వంగా షేర్ చేశాడు. ‘‘ఇజ్రాయిల్ దేశం మారణహోమం చేస్తున్న సమయంలో ఆ దేశానికి చెందిన ఓ టూరిస్టు ద్వీపంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఆమెను స్థానికులు తన్నితరిమేశారు. ఆమె ప్రస్తుతం ఎయిర్ పోర్టు వెళ్లే మార్గంలో ఉంది. మానవత్వం ఇకపై వారిని స్వాగతించదు’’ అని ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే ఆ దేశంలో ఇటీవల తీవ్రవాదం పెరుగుతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే కాకుండా పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబాలు మాల్దీవుల్లో తిష్టవేశాయి. 2014-18న మధ్య ఇస్లామిక్ స్టేట్ కోసం పోరాడేందుకు 5 లక్షల మంది ఉన్న మాల్దీవుల నుంచి 250 మంది పోరాడటానికి వెళ్లారు. ఇందులో చాలా మంది చనిపోయారు. నివేదికల ప్రకారం 2004 సునామీ తర్వాత మాల్దీవుల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరిగింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!