Pawan Kalyan: ముందస్తు ఎన్నికలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. పార్టీని పెట్టడం.. నడిపించడం సాధాన విషయం కాదు.. కానీ, జనసైనికుల పోరాటం వల్ల.. జనసేన పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు.. రాజకీయం చేయాలంటే దోపీడీ చేయాలనే భావనలోకి తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు.. వాలంటీర్ల గురించి నాకు రెండున్నరేళ్ల ముందే తెలుసు.. వాలంటీర్లు బెదిరిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేవారు.. కొందరు వైసీపీ నేతలే నా దృష్టికి తేచ్చిన పరిస్థితి ఉంది.. వైసీపీ వారి నుంచి నిరసన గళం విన్నాను అని తెలిపారు. మాదేం లేదు అన్నీ వాలంటీర్లు చేస్తున్నారు అని వైసీపీ నేతలే చెబుతున్నారన్న ఆయన.. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా పార్లమెంట్ లో చెప్పారని.. NCRB డేటా గురించి తెలుసుకుని నేను మాట్లాడానను స్పష్టం చేశారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
జగన్ అనే దుష్ట పాలకుడు మీద మనం పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు పవన్.. మనవాళ్ళ మీదే పక్కనుండి పొడవటం, సోషల్ మీడియా లో పోస్టుకు పెట్టడం సరి కాదని హితవుపలికారు. ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపుపై నేతలు ఫోకస్ పెట్టండి అని సూచించారు. ఇక, ఏపీ అభివృద్ది తెలంగాణకు కూడా చాలా అవసరం అన్నారు. హైదరబాద్ నుంచి షిఫ్ట్ అయ్యారా? అంటున్నారు.. నేను గతంలోనే విజయవాడ పటమటలో ఉండేవాడిని అని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ ఆంధ్ర వాళ్ల రాజధాని కాదని చెబితే.. ఇక్కడ ఇల్లు, స్థలం ఎక్కడ కొనాలో తెలియలేదన్నారు. ఏపీని రాక్షస పాలన నుంచి విముక్తి చేయాల్సి ఉంది.. రాజకీయాలు అంటే అనేక ప్రలోభాలు ఉంటాయి.. పదేళ్లుగా ప్రతికూల పరిస్థితుల్లో జనసేన నిలబడి ఉంది.. ఈ ఎన్నికల్లో చాలా గొడవలు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వైఎస్ జగన్, ఆయన అనుచరులు ఆధిపత్యం వదులు కోవటానికి సిద్దంగా ఉండరు.. అందుకే గొడవలకు అవకాశం ఉందన్నారు. కావున జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!