Gold Value: యుద్ధం ఎఫెక్ట్.. భారత్, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థల కంటే పసిడి విలువనే ఎక్కువ! ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Value: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు పసిడిని ఒక అజేయమైన ‘ఆర్థిక శక్తి’గా మార్చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ‘బంగారం’ వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో పసిడి మార్కెట్ విలువ ఊహించని స్థాయికి చేరుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మొత్తం విలువ $30 నుంచి $35 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్ (UK) దేశాల ఉమ్మడి జీడీపీ (సుమారు $8-$9 ట్రిలియన్లు) కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
READ ALSO: Ishan Kishan Girlfriend: ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..! ఇంత ఏజ్ గ్యాపా..?
Also Read
- Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
- Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
యుద్ధం తెచ్చిన ‘గోల్డ్’ రష్..
అమెరికా మద్దతుతో ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులు, ప్రతిగా టెహ్రాన్ చేసిన ప్రతీకార దాడుల వల్ల గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా అతలాకుతలమయ్యాయి. ఈ అనిశ్చితి వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మళ్లారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $5,400 మార్కును దాటి, $5,600 ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరువలో ఉంది. యుద్ధంతో పాటు పోస్ట్-పాండమిక్ ద్రవ్యోల్బణం భయాలు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేయడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి.
ఆర్థిక వ్యవస్థలను మించిన ‘బలం’
ఒకవైపు భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ల మార్కుకు చేర్చాలని దశాబ్ద కాలంగా శ్రమిస్తోంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ సుమారు $3 ట్రిలియన్ల వద్ద ఉంది. కానీ, ఎటువంటి ఫ్యాక్టరీలు, కార్మికులు లేని బంగారం.. కేవలం ‘భయం’ కారణంగా పెరిగిన డిమాండ్తో ఈ రెండు దేశాల ఉమ్మడి జీడీపీని మించిపోయింది. దీన్నే విశ్లేషకులు “ఫైనాన్షియల్ సూపర్ పవర్” అని పిలుస్తున్నారు. గత 13 ఏళ్లుగా ఒకే పరిధిలో కదులుతున్న బంగారం, ఇప్పుడు ఆ గీతను దాటి భారీ దూకుడు ప్రదర్శిస్తోంది. 1972 – 2005లో కనిపించిన తరహాలోనే ఇప్పుడు కూడా దాదాపు ఆరు నుంచి ఎనిమిదేళ్ల పాటు కొనసాగే సుదీర్ఘ ర్యాలీ ప్రారంభమైందని నిపుణులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ, బంగారం మాత్రం అత్యుత్తమ రాబడులను అందిస్తోంది. బంగారం ఇంతలా పెరగడానికి యుద్ధమే ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి, శాంతి నెలకొంటే ధరల్లో భారీ మార్పు వచ్చే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే, కేంద్ర బ్యాంకుల ఆసక్తి, కరెన్సీలపై నమ్మకం తగ్గడం వంటి కారణాల వల్ల పసిడి తన ఆధిపత్యాన్ని ఇలాగే కొనసాగిస్తుందని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Chhattisgarh Drug Bust: సినిమా ఫక్కీలో నల్లమందు సాగు.. పొలానికి సెక్యూరిటీగా బౌన్సర్లు!
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!