Parliament sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు.. కీలక బిల్లులపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి ప్రారంభమై 22 వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబరు 2న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. శీతాకాల సమావేశాలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. సాధారణంగా సెషన్ ప్రారంభానికి ఒక రోజు ముందు అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తారు. అయితే ఈసారి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 2వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల కానున్నాయి. అలాంటి పరిస్థితిలో ఈ ఫలితాలు పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: Yashasvi Jaiswal: నా తప్పే.. సారీ చెప్పా: యశస్వి జైస్వాల్
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ఇక, ఈ సెషన్లో అనేక ముఖ్యమైన బిల్లులను ఆమోదించడానికి కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వస్తే మరింత బలం పుంజుకుంటుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. పార్లమెంటులో సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు.. మహువా మోయిత్రాపై ఎథిక్స్ కమిటీ నివేదిక కూడా ఈ సెషన్లో సమర్పించనున్నారు. నగదు, బహుమతుల కోసం పార్లమెంట్లో గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగారని మహువా మోయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి నివేదికను రెడీ చేసింది. ఇప్పుడు దీన్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు.
Read Also: Harish Rao: ఓట్ల కోసం కాదు ప్రేమతో ఇచ్చాం.. రైతు బంధు ఆపిందే కాంగ్రెస్సే.
అలాగే, పార్లమెంటులో ఈ నివేదికను ఆమోదించిన తర్వాత, మహువా మొయిత్రాను పార్లమెంటు నుండి బహిష్కరించడం ఖాయమవుతుంది. ఈ సెషన్లో ఇండియన్ జస్టిస్ కోడ్తో సహా మూడు ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లులు ఐపీసీ, సీఆర్పీసీతో పాటు ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఉంటాయి. ఈ మూడు బిల్లులకు ఇప్పటికే హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్ లో ఆమోదం కోసం ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. వాస్తవానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతి ఏడాది నవంబర్ మూడో వారంలో ప్రారంభమై క్రిస్మస్ పండుగకు ముందు ముగియనున్నాయి. కానీ, ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యంగా మొదలవుతున్నది. ఎప్పటి లాగే క్రిస్మస్ పండుగకు ముందు ఈ సెషన్స్ ముగియనున్నాయి.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!