Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- అంతులేని యుద్ధాన్ని ముగించండి
- పుతిన్కు మోడీ కీలక సందేశం
- ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు అన్ని శాంతియుత ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. “అంతులేని యుద్ధం పరిస్థితి నుంచి యుద్ధం ముగిసే దిశగా మనం ముందుకు సాగాలి. ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలన్నదే మానవాళి ఆకాంక్ష” అని మోడీ పేర్కొన్నారు.

Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఉక్రెయిన్ అంశంపై మనం నిరంతరం చర్చించుకుంటున్నాం. గతసారి మనం కలిసినప్పుడు కూడా మీరు పరిస్థితిని నాకు విపులంగా వివరించారు. ఈ సంక్షోభానికి పరిష్కారం కోసం అన్ని శాంతియుత మార్గాలకు భారత్ మద్దతు ఇస్తోంది” అని మోడీ తెలిపారు. అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని, ఇది మొత్తం మానవాళికి అవసరమని స్పష్టం చేశారు. “ప్రతిరోజూ కొనసాగే యుద్ధం మానవాళిని వెనక్కి నెడుతుంది. అందువల్ల ఘర్షణలను ముగించేందుకు మనం కృషి చేయాలి” అని మోడీ పిలుపునిచ్చారు.
‘ఇది యుద్ధ సమయం కాదు’
2022లో పుతిన్తో జరిగిన సమావేశంలో మోడీ చేసిన ‘ఇది యుద్ధ సమయం కాదు’ వ్యాఖ్యను తాజా ప్రకటన మరోసారి గుర్తుచేసింది. అప్పట్లో కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం దౌత్యం, చర్చల ద్వారానే సాధ్యమని మోడీ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన చర్చల్లోనూ భారత్ ఇదే వైఖరిని వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ పదేపదే సూచించింది.

భారత్ శాశ్వత శాంతికి మద్దతుదారుగా ఉంటుందని మోడీ తెలిపారు. “భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఇది యుద్ధ సమయం కాదు. మానవాళికి ముప్పుగా మారుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన సమయం. అందుకే భారత్ దౌత్యం, చర్చలను విశ్వసిస్తుంది” అని గతంలో మోడీ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. భారత్ బుద్ధుడి భూమి అని, భారతీయుల ప్రత్యేకతల్లో సానుభూతి కూడా ఒకటని మోడీ అప్పట్లో వివరించారు. యుద్ధానికి బదులు శాంతి మార్గాన్ని అనుసరించాలన్నది బుద్ధుడి బోధనల సారాంశమని పేర్కొన్నారు. తాజాగా కూడా “గాంధీ, బుద్ధుల భూములైన భారత్ ఒకే సందేశాన్ని పంచుకుంటున్నాయి.. అది శాంతి మార్గం” అని మోడీ స్పష్టం చేశారు.
త్వరలో భారత్కు పుతిన్
మోడీ-పుతిన్ భేటీకి మరో ప్రాధాన్యం ఉంది. వచ్చే వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరుకానున్న నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక సమావేశం జరిగింది. దీంతో రష్యా-భారత్ సంబంధాలతో పాటు ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతల మధ్య చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.
- Tags
- modi
- Putin
- Russia
- ukraine war
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!