Yashasvi Jaiswal: నా తప్పే.. సారీ చెప్పా: యశస్వి జైస్వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I Accepted my mistake Said Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. తన పార్ట్నర్ రుతురాజ్ గైక్వాడ్కు సారీ చెప్పాడట. ఈ విషయాన్ని రెండో టీ20 మ్యాచ్ అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సందర్భంగా మాట్లాడుతూ వెల్లడించాడు. ‘మొదటి టీ20 మ్యాచ్లో రనౌట్ నా తప్పే. అందుకు నేను రుతురాజ్కు సారీ చెప్పా. నా తప్పును అతడి ముందు అంగీకరించా. రుతురాజ్ చాలా మంచి వ్యక్తి. ఎంతో జాగ్రత్తగా ఉంటాడు’ అని జైస్వాల్ తెలిపాడు. మొదటి టీ20 మ్యాచ్లో రుతురాజ్ డిమాండ్ డకౌట్ అయిన విషయం తెలిసిందే.
రెండో టీ20 మ్యాచ్ గురించి యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్ నాకు ప్రత్యేకమైనది. నా షాట్లన్నీ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. నిర్భయంగా షాట్లు కొట్టా. షాట్ల ఎంపిక విషయంలో కూడా స్పష్టంగా ఉన్నా. మైదానంలో స్వేచ్ఛగా ఆడు అని మ్యాచ్కు ముందు కెప్టెన్ సూర్య , కోచ్ లక్ష్మణ్ చెప్పారు. దీంతో నా ఆటలు మైదానంలో చూపించాలనుకున్నా. నేను ఆటను మెరుగుపర్చుకోవాలనుకుంటా. అంతకుమించి మరేదీ ఆలోచించను. నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నా. మానసిక అంశాలపై దృష్టి పెట్టా. నా ప్రాక్టీస్ సెషన్లపై నాకు నమ్మకం ఉంది’ అని అన్నాడు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Also Read: Sharad Pawar Rain: ఏమైనా సరే వెనకడుగు వేయం.. వర్షంలో తడుస్తూ ప్రసంగించిన 82 ఏళ్ల శరద్ పవార్!
తిరువనంతపురం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో యువ భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు), రుతురాజ్ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), ఇషాన్ కిషన్ (52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంచరీలు చేశారు. ఆపై ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడిపోయింది. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవిబిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీశారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!