Pankaj Tripathi : అందుకే బాలీవుడ్ విఫలం అవుతుంది..‘మీర్జాపూర్’ నటుడు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇందులో ఎంతో కీలకమైన కలీన్ భయ్యా పాత్రలో పంకజ్ త్రిపాఠి కనిపించారు. బాలివుడ్లోనే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా పంకజ్ దగ్గరయ్యారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పంకజ్ త్రిపాఠీ బాలివుడ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పంకజ్ త్రిపాఠి తన బాల్యం, బీహార్లోని ఒక చిన్న పట్టణం నుంచి సినిమా వరకు తన ప్రయాణం వంటి అనేక అంశాల గురించి మాట్లాడారు. ప్రేక్షకులు బాలీవుడ్తో కనెక్ట్ అవ్వలేకపోవడానికి కారణాన్ని వివరించారు. ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తుండిపోయే కథలను తెరకెక్కించడంలో బాలీవుడ్ విఫలమైందన్నారు.
READ MORE: Kadiyam Srihari: బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు.. కేటీఆర్, కవితలకే ఎక్కువ
Also Read
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
‘మనం గ్రౌండ్ లెవల్ కథలను చూపించకపోతే ప్రజలు మన సినిమాలతో ఎందుకు కనెక్ట్ అవుతారు?’ అని అన్నారు. “90ల, అంతకు ముందు తీసిన సినిమాల్లో ఒక మాయాజాలం ఉండేది. వాటికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవారు. ఆ చిత్రాలను కుంటుంబ మొత్తం కలిసి చేసేవారు. అదే స్థాయిలో ఆనందించే వారు. పాత్రల్లో నటించిన వాళ్లు ఏడిస్తే.. ప్రేక్షకులు కూడా ఏడ్చే వాళ్లు.. నటులు నవ్వితే వాళ్లు కూడా నవ్వుకునేవాళ్లు. కానీ ఆ మ్యాజిక్ ఇప్పటి కథల్లో లేదు. కేవలం వినోదం కోసం మాత్రమే చూస్తున్నారు. పాత్రలతో కనెక్ట్ కావడం లేదు. తమకు సంబంధించిన వారి కోసం సినిమాలు చూస్తున్నారు. వారు సినిమాల్లో, నటుల్లో తమ మూలాలు వెతుకుతున్నారు. కథలో ప్రేక్షకులకు కనెక్ట్ అయితే.. ఎన్ని సార్లు విడుదలైనా ప్రేక్షకాదరణ అలాగే ఉంటుంది. దానికి ఉదాహరణ.. నేను నటించిన ‘బరేలీ కీ బర్ఫీ’ చిత్రం. ఇటీవల విడుదలైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకాదరణ పొందింది.” అని నటుడు పంచజ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
READ MORE: Hyderabad Chicken Sales: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్లో భారీగా తగ్గిన చికెన్ అమ్మకాలు!
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పంకజ్ ‘స్త్రీ’ సినిమా గురించి కూడా మాట్లాడారు. “‘స్త్రీ’ ఒక జనర్ హర్రర్ సినిమా. ఇది సినిమా గొప్ప విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత జానర్లో ఎన్నో సినిమాకు వచ్చాయి. ఈ సినిమాలకు చూసి జనాలు భయపడకుండా నవ్వుకున్నారు.” అని పంకజ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!