Telangana: ఉపాధి హామీ వర్కర్లకు శుభవార్త.. రూ.300 కోట్లు విడుదల చేసిన సర్కార్
- పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బిల్లుల క్లియరెన్స్
- దశలవారీగా కొనసాగుతున్న ప్రక్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ దశలవారీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం తొలి దశలో ఆర్థిక శాఖ ద్వారా రూ.446 కోట్లను విడుదల చేశారు. ఈ మొత్తంలో నుంచి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బిల్లులకు రూ.300 కోట్లను, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం రూ.146 కోట్లను విడుదల చేశారు.
ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో నూతన ఉత్సాహం నెలకొంది. గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల నవంబర్ నెల వేతనాలు ఈ నిధులతో పూర్తిగా చెల్లించబడతాయని ప్రభుత్వం వెల్లడించింది. డిసెంబర్ నెల వేతనాలకు సంబంధించి కూడా త్వరలోనే నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం. అందుబాటులో ఉన్న కుబేర్ సిస్టమ్ ద్వారా కార్మికుల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
Also Read
- AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్నినోపై చర్చ!
- TVK Vijay Government: విజయ్ ప్రభుత్వానికి 100 రోజులు.. “డమ్మీ సీఎం” అంటూ విమర్శలు..!
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్లో విమాన సేవలు ప్రారంభం.. తొలి కమర్షియల్ ఫ్లైట్గా ఇండిగో!
- The Hundred Women's Champions: కావ్య మారన్కు నిరాశ.. ఫైనల్లో సన్రైజర్స్పై ట్రెంట్ రాకెట్స్ విజయం.!
గ్రామ పంచాయతీలకు బిల్లుల చెల్లింపులతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాల విషయంలో ఉత్కంఠ తొలగిపోనుందని భావిస్తున్నారు. దీంతో సుమారు 95,000 మంది కార్మికుల వేతనాలు త్వరితగతిన జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రభుత్వ బడ్జెట్ పూర్తిస్థాయిలో వినియోగించేందుకు చర్యలు వేగవంతం చేశారు. బిల్లుల చెల్లింపులు త్వరితగతిన ప్రారంభం కావడంతో సర్పంచ్లు, పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వారి ఇబ్బందులను అర్థం చేసుకుని తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమైన పాలనకు మరో అంకురం వేస్తుందని పంచాయతీరాజ్ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 17 మంది మావోల హతం
తాజావార్తలు
-
Alias Rukmini: నితిన్ కోసం రంగంలోకి దిగిన నాని.. ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్కు రెడీ!
-
El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
-
Prabhas : ‘ఫౌజీలో ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే’.. హను వర్క్ పట్ల సన్నిహితులతో ప్రభాస్
-
Explainer: ఆంధ్రప్రదేశ్లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
-
Mahesh Babu : ‘డీసీ’ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్.. ఒరిజినల్ అండ్ అవుట్స్టాండింగ్
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?