Telangana: పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ దశలవారీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం తొలి దశలో ఆర్థిక శాఖ ద్వారా రూ.446 కోట్లను విడుదల చేశారు. ఈ మొత్తంలో నుంచి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బిల్లులకు రూ.300 కోట్లను, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం రూ.146 కోట్లను విడుదల చేశారు. ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ప్రారంభమవడంతో గ్రామీణ…