Palnadu Ra*pe Case: మహిళా ఉద్యోగిని అత్యాచారం కేసులో కీలక మలుపు.. అదుపులో అనుమానితుడు..!
- పల్నాడు జిల్లాలో మహిళా ఉద్యోగిపై అత్యాచారం కేసులో కీలక మలుపు
- సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించిన పోలీసులు
- బాధితురాలి ప్రియుడే అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రాథమిక నిర్ధారణ
- రాజుపాలెంకు చెందిన శ్రీనివాస్ (30)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palnadu Rape Case: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా ఉద్యోగిపై అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ప్రియుడే ఆమెపై అత్యాచారం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. సిసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ నెల 2న మహిళా ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాహంగా ఉంది నీళ్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తి, కత్తితో బెదిరించి అత్యాచారం చేసినట్టు బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. అత్యాచారం చేసిన తర్వాత తనను తీవ్రంగా గాయపరిచినట్టు కూడా చెప్పింది బాధితురాలు.
Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ఈ కేసును విచారణ చేపట్టిన పోలీసులు క్లూస్ టీం ఫారెన్సిక్ టీమ్ ను రంగంలోకి దించారు. బాధిత మహిళ ఇంట్లో ఆధారాలు సేకరించారు. దీంతో పాటు ఇంటి సమీపంలో ఉన్న సిసి ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. బాధిత మహిళ చెప్పిన సమయంలో ఆ వీధిలోకి ఎవరెవరు వచ్చారో గమనించారు. మహిళ చెప్పిన సమయంలో ఓ యువకుడు వచ్చినట్టు గుర్తించారు. కానీ బాధితురాలు తనపై 45 నుంచి 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Liquor Shop Holidays: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీల్లో వైన్ షాపులు క్లోజ్!
బాధిత మహిళతో పాటు సిసి ఫుటేజ్ లో కనిపించిన యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మహిళపై అత్యాచారానికి పాల్పడింది సిసి ఫుటేజ్ లో ఉంది ఒక్కరే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ లోని యువకుడు పల్నాడు జిల్లా రాజుపాలెంకు చెందిన శ్రీనివాస్ (30) గుర్తించారు పోలీసులు. ఆ యువకుడు కొంతకాలంగా మహిళతో రిలేషన్షిప్ లో ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆమెపై అనుమానంతో యువకుడు దారుణంగా ప్రవర్తించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడిని మాచర్లకు తరలించి అక్కడ విచారించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!