Palnadu Ra*pe Case: మహిళా ఉద్యోగిని అత్యాచారం కేసులో కీలక మలుపు.. అదుపులో అనుమానితుడు..!
- పల్నాడు జిల్లాలో మహిళా ఉద్యోగిపై అత్యాచారం కేసులో కీలక మలుపు
- సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించిన పోలీసులు
- బాధితురాలి ప్రియుడే అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రాథమిక నిర్ధారణ
- రాజుపాలెంకు చెందిన శ్రీనివాస్ (30)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palnadu Rape Case: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా ఉద్యోగిపై అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ప్రియుడే ఆమెపై అత్యాచారం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. సిసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ నెల 2న మహిళా ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాహంగా ఉంది నీళ్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తి, కత్తితో బెదిరించి అత్యాచారం చేసినట్టు బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. అత్యాచారం చేసిన తర్వాత తనను తీవ్రంగా గాయపరిచినట్టు కూడా చెప్పింది బాధితురాలు.
Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!
Also Read
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
ఈ కేసును విచారణ చేపట్టిన పోలీసులు క్లూస్ టీం ఫారెన్సిక్ టీమ్ ను రంగంలోకి దించారు. బాధిత మహిళ ఇంట్లో ఆధారాలు సేకరించారు. దీంతో పాటు ఇంటి సమీపంలో ఉన్న సిసి ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. బాధిత మహిళ చెప్పిన సమయంలో ఆ వీధిలోకి ఎవరెవరు వచ్చారో గమనించారు. మహిళ చెప్పిన సమయంలో ఓ యువకుడు వచ్చినట్టు గుర్తించారు. కానీ బాధితురాలు తనపై 45 నుంచి 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Liquor Shop Holidays: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీల్లో వైన్ షాపులు క్లోజ్!
బాధిత మహిళతో పాటు సిసి ఫుటేజ్ లో కనిపించిన యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మహిళపై అత్యాచారానికి పాల్పడింది సిసి ఫుటేజ్ లో ఉంది ఒక్కరే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ లోని యువకుడు పల్నాడు జిల్లా రాజుపాలెంకు చెందిన శ్రీనివాస్ (30) గుర్తించారు పోలీసులు. ఆ యువకుడు కొంతకాలంగా మహిళతో రిలేషన్షిప్ లో ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆమెపై అనుమానంతో యువకుడు దారుణంగా ప్రవర్తించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడిని మాచర్లకు తరలించి అక్కడ విచారించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?