Pakistani Reporter: రిపోర్టింగ్ చేయి తప్పులేదు.. కానీ ఇంత అవసరం లేదుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Reporter: ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవ శక్తి ఎంత చిన్నదో తెలియజేసే ఘటన తాజాగా పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. అక్కడి రిపోర్టర్ ఒకరు వరద పరిస్థితిని కవర్ చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించి తన ప్రాణాన్ని కోల్పోయి పరిస్థితిని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లలో పెద్ద చర్చకు దారి తీసింది. పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో తాజాగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతతో వరదలు అదుపుతప్పి జనజీవనాన్ని ముంచెత్తాయి. దీనితో అక్కడ మౌలిక సదుపాయాల్లేని పరిస్థితుల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు కొట్టుకుపోతుండగా, వంతెనలు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రిపోర్టర్ వరద ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితిని రికార్డు చేయాలనుకున్నారు.
Louise Fischer: లైవ్ ఇంటర్వ్యూలో శృంగారంలో పాల్గొన్న రిపోర్టర్.. వీడియో వైరల్!
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
నిజానికి అతడు ఎటువంటి ప్రమాదమూ లేకుండా దూరం నుంచి కెమెరామెన్ సహాయంతో రిపోర్టింగ్ చేయడం చాలు. అయితే, ఈ రిపోర్టర్ మాత్రం అక్కడి పరిస్థితిని తక్కువ అంచనా వేశాడు. దానితో ఇంకేముంది.. తనకంటే ధైర్యంగా ఇంకెవ్వరూ లేరన్నట్టుగా నేరుగా వరద నీటిలోకి అడుగుపెట్టాడు. ఆలా వెళ్లిన అతడు కొన్ని సెకన్ల పాటు పట్టు నిలుపికి రిపోర్టింగ్ చేసాడు. అలా చేస్తున్న సమయంలో వరద ప్రవాహం పెరిగి చూస్తుండంగానే అతడిని ముంచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ చాలా మంది ఆ రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Ashok Gajapathi Raju: అప్పుడే గవర్నర్గా ప్రమాణ స్వీకారం.. తేదీ ఫిక్స్ చేసిన అశోక్ గజపతిరాజు
⚡ A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water. pic.twitter.com/psQsgDMsFI
— OSINT Updates (@OsintUpdates) July 17, 2025
ఇందులో కొందరు..రిపోర్టర్ ప్రాణం పోయిన తర్వాత అతని కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. రిపోర్టింగ్ చేయడం తప్పు కాదు, కానీ ప్రాణాల్ని పణంగా పెట్టి చేయాలిసిన అవసరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?