భారత్, పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఈ అంశంపై పాక్ మంత్రి స్పందించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తక్షణ కాల్పుల విరమణను ధృవీకరించారు. భారతదేశం -పాకిస్థాన్ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయంపై ఇరు దేశాలు అంగీకరించాయి. “పాకిస్థాన్-భారత్ తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రాజీ పడలేదు. దేశంలో శాంతి, భద్రత కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాం!” అని సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో ట్వీట్ చేశారు.
READ MORE: IND PAK War: కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్- పాకిస్థాన్.. ట్రంప్ స్పష్టం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాలు వివేకాన్ని ప్రదర్శించాయని ట్రంప్ అన్నారు. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు.. ట్రంప్ ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో ఇచ్చారు. సుదీర్ఘ చర్చల తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు.
READ MORE: Lava Agni 3: లిమిటెడ్ ఆఫర్.. లావా అగ్ని 3 పై ఏకంగా రూ. 5000 వరకు తగ్గింపు.!