S Jaishankar: ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదు.. పాక్పై విదేశాంగ మంత్రి మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: పాకిస్థాన్ ఒక పరిశ్రమగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద సమస్యను విస్మరించడానికి భారత్ ఏమాత్రం అనుకూలంగా లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం అన్నారు. సింగపూర్లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన జైశంకర్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ (ఐఎస్ఏఎస్)లో తన పుస్తకం ‘వై ఇండియా మేటర్స్’పై జరిగిన లెక్చర్ సెషన్ తర్వాత జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్తో భారత్ సంబంధాలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ప్రతి దేశం సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుందని.. గత్యంతరం లేక కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైన ఉండాలి. దురదృష్టవశాత్తూ ఇది భారతదేశం విషయంలో అలా లేదన్నారు.
Read Also: INDIA Bloc: కూటమిలో మరో చీలిక.. అభ్యర్థుల్ని ప్రకటించేసిన ఆర్జేడీ
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఒక పరిశ్రమ స్థాయిలో పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితిలో భారత్ లేదు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాలి. దానినుంచి తప్పించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేకపోగా.. తిరిగి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతి దేశమూ ఒక సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుంది. అదీ కాకపోతే, కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా ఉండాలని ఆశిస్తుంది. పాక్తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడనట్టు వదిలేయలేం’’ అని జైశంకర్ అన్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని.. ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదని భారత్ వైఖరిని జైశంకర్ చెప్పుకొచ్చారు.
Read Also: Asia’s Largest Tulip Garden: తెరుచుకున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!
అరుణాచల్ ప్రదేశ్పై చైనా వాదన అసంబద్ధం: జైశంకర్
అరుణాచల్ ప్రదేశ్పై చైనా పదే పదే చేస్తున్న వాదనలు అసంబద్ధం అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొట్టిపారేశారు. ఈ సరిహద్దు రాష్ట్రం భారతదేశంలో సహజ భాగమని ఆయన అన్నారు. అరుణాచల్పై చైనా తరచుగా చేస్తున్న వాదనలు, ఆ రాష్ట్రానికి భారత రాజకీయ నాయకులు సందర్శనలు చేయడంపై చైనా వ్యతిరేకతపై బహుశా తన మొదటి బహిరంగ వ్యాఖ్యలో జైశంకర్.. ఇది కొత్త విషయం కాదని అన్నారు. చైనా-భారత్ సరిహద్దులోని తవాంగ్కు సైనిక బలగాలను తరలించేందుకు ఉపయోగపడే సేలా సొరంగ మార్గాన్ని ప్రధాని మోడీ ఇటీవల ప్రారంభించగా.. అది తమ భూభాగమని చైనా నోరు పారేసుకుంది. ఈ వ్యవహారం జైశంకర్ మాట్లాడుతూ.. ఆ వాదన హాస్యాస్పదమని అరుణాచల్ ప్రదేశ్ దేశంలో సహజ భూభాగమని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!