PIA UK Flights: ఐదేళ్ల నిషేధం తర్వాత.. UKకి విమానాలను తిరిగి ప్రారంభించిన పాకిస్తాన్..
- ఐదేళ్ల నిషేధం తర్వాత
- UKకి విమానాలను తిరిగి ప్రారంభించిన పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నకిలీ పైలట్ లైసెన్స్ కుంభకోణం తర్వాత ఐదేళ్ల పాటు నిషేధించబడిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (PIA) శనివారం యునైటెడ్ కింగ్డమ్ (UK) కు తన విమానాలను తిరిగి ప్రారంభించింది. “జూలై 2020 తర్వాత ఇస్లామాబాద్ నుండి మాంచెస్టర్కు మొదటి విమానం 284 మంది ప్రయాణికులతో బయలుదేరింది” అని PIA ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ కూడా విమానంలో ప్రయాణించారు.
Also Read:Student: మద్యం షాపు వద్ద స్కూల్ యూనిఫాంలో ఉన్న బాలికలు.. షాకిచ్చిన అధికారులు..
Also Read
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
- Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
- Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
2020లో కరాచీలో దాదాపు 100 మంది ప్రయాణికులు మరణించిన విషాదకరమైన విమాన ప్రమాదం తరువాత యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) మరియు UK సివిల్ ఏవియేషన్ అథారిటీ PIA విమానాలను నిషేధించాయి. అప్పటి విమానయాన మంత్రి గులాం సర్వార్ ఖాన్ పెద్ద సంఖ్యలో పాకిస్తానీ పైలట్లు నకిలీ లైసెన్సులు కలిగి ఉన్నారని వెల్లడించారు.
గత ఏడాది నవంబర్లో EASA నిషేధాన్ని ఎత్తివేసింది, అయితే UK ఈ ఏడాది జూలైలో పాకిస్తాన్ను తన విమాన భద్రతా జాబితా నుండి తొలగించింది, దీని ద్వారా పాకిస్తాన్ విమానయాన సంస్థలు బ్రిటన్కు విమానాలు నడపడానికి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. విమానం బయలుదేరే ముందు ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక సాధారణ వేడుక జరిగింది. దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ, దౌత్య కార్యకలాపాలు, విమానయాన రంగానికి చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు.
Also Read:Star Heroine’s : ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పు కాదు.. స్టార్ హీరోయిన్స్ ఇలా అన్నారేంటి
ఈ సందర్భంగా రక్షణ మంత్రి ఆసిఫ్ మాట్లాడుతూ, ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడం వల్ల పాకిస్తాన్, యుకె మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. యుకెలో నివసిస్తున్న 1.6 మిలియన్లకు పైగా పాకిస్తానీయులకు ఈ సేవ మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఆప్షన్స్ ను అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రారంభంలో ఇస్లామాబాద్, మాంచెస్టర్ మధ్య వారానికి రెండు విమానాలను మంగళ, శనివారాల్లో నడుపుతామని, క్రమంగా లండన్, బర్మింగ్హామ్లకు కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్నట్లు PIA తెలిపింది.
తాజావార్తలు
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
-
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
-
RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..