మధ్యప్రదేశ్ లోని మండలా జిల్లాలోని నైన్పూర్లోని ఒక కాంపోజిట్ లిక్కర్ దుకాణంలో పాఠశాల విద్యార్థినులకు మద్యం అమ్ముతున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వీడియో విస్తృతంగా వైరల్ కావడంతో, అధికార యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం, అధికార యంత్రాంగం, ఎక్సైజ్ శాఖ అధికారులు సంబంధిత మద్యం దుకాణానం వద్దకు చేరుకున్నారు.
Also Read:Kurnool Bus Fire Accident: పోలీసుల కీలక ప్రకటన.. వీడిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ!
అధికారులు దుకాణంలోని పత్రాలు, స్టాక్ను పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో మద్యం వ్యాపారులు పాఠశాల విద్యార్థులకు మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. నైన్పూర్ లోని కాంపోజిట్ లిక్కర్ దుకాణం నుండి ఒక పాఠశాల విద్యార్థినికి మద్యం విక్రయించినట్లు నిర్ధారించబడిందని జిల్లా ఎక్సైజ్ అధికారి తెలిపారు. దీంతో ఆ షాపుపై ఎక్సైజ్ చట్టం కింద క్రిమినల్ కేసును నమోదు చేసినట్లు తెలిపారు.