Air Pollution: ఢిల్లీ-నోయిడా మాత్రమే కాదు.. పాకిస్తాన్లో కూడా అధ్వాన్నంగా కాలుష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Pollution: భారత్కే కాదు పొరుగు దేశం పాకిస్థాన్కు కూడా కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో కాలుష్యం ప్రజలకు సమస్యగా మారింది. ఎమర్జెన్సీని కూడా ప్రభుత్వం విధించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. లాహోర్ హైకోర్టు మందలింపుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి, పెరుగుతున్న కాలుష్యానికి ప్రస్తుత ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ నగరంలో ఎమర్జెన్సీ విధించాలని లాహోర్ హైకోర్టు పరిపాలనకు ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు పొగకు కారణమైన ఫ్యాక్టరీలను తిరిగి తెరవవద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పాటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కూడా ఇలాంటి ఫ్యాక్టరీల గురించి అధికారులకు తెలియజేయాలని కోరారు. కమీషనర్ సహా అధికారులందరూ పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులకు ఈ విషయాన్ని తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.
Read Also:Ponguleti: ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు వేరు వేరు కాదు రెండు ఒక్కటే..
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
ప్రస్తుత పరిస్థితులపై లాహోర్ కమిషనర్ మహ్మద్ అలీ రంధావాను హైకోర్టు న్యాయమూర్తి షాహిద్ కరీం తీవ్రంగా మందలించారు. పొగమంచు అనేది తన వ్యక్తిగత సమస్య కాదని, పిల్లలకు సంబంధించిన సమస్య కూడా అని అన్నారు. ఇది కూడా చాలా ఆందోళన కలిగించే అంశం. నగరానికి కాపలాదారు కూడా నువ్వే, ఏం చేశావో చూడు అంటూ కమిషనర్ కు చెప్పారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు నవంబర్ 3కి వాయిదా వేసింది. పొగమంచు కారణంగా లాహోర్ విషపూరిత గ్యాస్ ఛాంబర్గా మారింది. పరిస్థితి దారుణంగా మారుతోంది. ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో లాహోర్ అగ్రస్థానంలో ఉండటం మంగళవారం వరుసగా మూడో రోజు. ఒక నివేదిక ప్రకారం ఇక్కడ గాలి నాణ్యత సూచిక (AQI) 255 వద్ద నమోదైంది. ఇక్కడ AQI సోమవారం 447కి చేరుకుంది. పంజాబ్ అంతటా స్మోగ్ ఎమర్జెన్సీ విధించామని, అన్ని పాఠశాలల్లోని పిల్లలకు నెల రోజుల పాటు మాస్క్లు ధరించడం తప్పనిసరి చేశామని పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.
Read Also:Lanka Dinakar: ఇదేనా రివర్స్ టెండ”రింగ్” అంటే..? వారికి సీఎం ప్రాధాన్యత వెనుక మతలబు ఏంటి..?
తాజావార్తలు
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!