Pakistan: పాకిస్తాన్ని ఎగతాళి చేస్తున్న సొంత ప్రజలు.. కామెంట్స్ చూస్తే నవ్వాపుకోలేరు..
- పాకిస్తాన్పై సొంత దేశ ప్రజల ఎగతాళి..
- యుద్ధ ఉద్రక్తతల నేపథ్యంలో పాక్ దరిద్రంపై ఫన్నీ కామెంట్స్..
Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది సాధారణ పౌరులు, ముఖ్యంగా మతం ఆధారంగా హిందువుల్ని లక్ష్యంగా చేయడం పట్ల యావత్ దేశం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ మేరకు పాకిస్తాన్పై తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే, భారత్ ఇప్పటికే దౌత్యయుద్ధాన్ని మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసి, పాకిస్తాన్కి భారీ షాక్ ఇచ్చింది. ఇక పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. మరోవైపు, పాకిస్తాన్ కూడా భారత్పై ప్రతీకా చర్యలకు పాల్పడుతోంది. ‘‘సిమ్లా ఒప్పందం’’ రద్దుతో పాటు పాక్ ఎయిర్ స్పేస్ని భారత విమానాలకు మూసేసింది.
ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ తన బలగాలను భారత సరిహద్దు వైపు మోహరిస్తోంది. అనేక యుద్ధ విన్యాసాలు చేస్తోంది. భారత్ దాడిని తట్టుకునేందుకు అన్ని పథకాలను రచిస్తోంది. అయితే, పాకిస్తాన్ సత్తాపై పాక్ ప్రజలకే నమ్మకం లేకుండా పోయింది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో అక్కడి నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. సోషల్ మీడియా వ్యాప్తంగా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
Also Read
- West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. 'ఇరాన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం'.. ట్రంప్
- Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
- Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
- Donald Trump: ట్రంప్ 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రకటన.. హార్మూజ్లో చిక్కుకున్న ఓడలను సురక్షితంగా బయటకు..
Read Also: Kasthuri : రాత్రి 9 దాటిందంటే చాలు దానిపై మనసు లాగేస్తోంది..
పాకిస్తాన్ తన ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలను అందించడంలో ఎలా విఫలమైందో పాక్ ప్రజలు సెటైరికల్ పోస్టులతో ఎత్తి చూపారు. ఒక యూజర్ ఎక్స్లో ‘‘ భారతీయులు పాకిస్తాన్తో యుద్ధం కోరుకుంటే గంటల్లోపే దాన్ని ముగించాలి’’ అని సూచించాడు. ఎందుకంటే ఆ తర్వాత గ్యాస్ సరఫరా ఆగిపోతుందని అంటూ సొంత దేశాన్ని ఎగతాళి చేశాడు. మరో యూజర్ వ్యంగ్యంగా, ‘‘ వారికి మరిన్ని కుంటి సాకులు ఇవ్వకండి. గోధుమ పిండి, నీరు, భిక్షం, ఇప్పుడు గ్యాస్.’’ అని పాక్ దరిద్రాన్ని ఒక పోస్టులో చెప్పాడు. మరో నెటిజన్‘‘ వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారని వారికి తెలియాలి’’ అని దేశ ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపాడు.
ఒక పాకిస్థానీ నెటిజన్ పాక్ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ, ఒక పాపులర్ మీమ్ని షేర్ చేశాడు. ఫైటర్ జెట్ లాగా కనిపించే ఒక పేపర్ ఫైటర్ జెట్ ఆకారాన్ని మోటార్ సైకిల్కి అమర్చి నడుపుతున్న మీమ్ హల్చల్ చేస్తుంది. సింధు నది నీటిని భారత్ ఆపాలని నిర్ణయించడంపై ఒక పాకిస్తాన్ యూజర్ ధ్వజమెత్తాడు. ‘నీటిని ఆపాలనుకుంటున్నారా..? ఏమైనప్పటికీ నీటి సరఫరా లేదు. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా..? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్ని తీసుకోవాలనుకున్నారా..? అరగంటలోనే దాన్ని మీరు తిరిగి ఇస్తారు’’ అని ఆ దేశ దరిద్రంపై సెటైర్లు వేశాడు.
తాజావార్తలు
-
Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
-
Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..
-
EKDIN : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. డిజాస్టర్
-
West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ‘ఇరాన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం’.. ట్రంప్
-
South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!