Gas Cylinder: వామ్మో గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 లా.. ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాయది దేశం పాకిస్థాన్లో కష్టాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనపడటం లేదు.. పాక్ లో ఆర్థిక సంక్షోభం క్రమంగా పెరగడంతో సామాన్య ప్రజల వెన్ను విరుస్తుంది. సెప్టెంబరులో అంతర్జాతీయ ద్రవ్య నిధి ఒత్తిడితో ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచేసింది. $3 బిలియన్ల బెయిలవుట్ ప్యాకేజీని పొందడానికి పాక్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత, ద్రవ్యోల్బణం రేటులో భారీ పెరుగుదల కనిపించింది. సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం రేటు 31.44 శాతానికి మేర పెరిగింది.
Read Also: Asha Workers: కరీంనగర్ లో ఉద్రిక్తత.. మంత్రి గంగుల ఇంటి ముందు ఆశా వర్కర్ల ఆందోళన
Also Read
- FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
- Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
- Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
జూలై నుంచి ప్రారంభమైన ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీని స్వీకరించేందుకు సెప్టెంబర్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను పెంచాలని పాకిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. దీని తర్వాత దేశంలో రవాణా ధరలు ఏడాదికి 31.26 శాతం పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఆహార ద్రవ్యోల్బణం రేటు సంవత్సరానికి 33.11 శాతం మేర పెరిగింది. ఇల్లు, నీరు, విద్యుత్ ధరలు 29.70 శాతం మేర పెరుగాయి. ఇక, అక్టోబర్ 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పాకిస్థాన్ ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్కు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 246.16 మేర పెంచింది. దీంతో ఒక LPG సిలిండర్ 3079.64 రూపాయలకి పెరిగింది.
Read Also: Hyderabad Man Kills in London: లండన్లో హైదరాబాద్ వాసి దారుణ హత్య.. కూతురి పెళ్లి కోసం వస్తుండగా..!
ఇక, పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం.. ఈ ద్రవ్యోల్బణం బ్లూమ్బెర్గ్ డేటా 30.94 శాతం కంటే కొద్దీగా ఎక్కువగా ఉంటుంది. ఆగస్టులో పాక్ లో ద్రవ్యోల్బణం రేటు 27.40 శాతంగా ఉంది. అయితే, ఈ నెలలో కూడా ద్రవ్యోల్బణం రేటు పెరుగుదల నమోదు కావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. ఇక, అక్టోబర్ 30న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ మీటింగ్ జరుగనుంది. ఇందులో వడ్డీ రేట్లపై ప్రధానంగా సమీక్షిస్తారు.
Read Also: Ponguleti: కాంగ్రెస్ అంటేనే గ్రూపులు.. గ్రూపులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టే కాదు
ఇలాంటి పరిస్థితిలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి బ్యాంక్ కొన్ని అవసరమైన చర్యలు తీసుకోనుంది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం రేటు జూన్ 2024 వరకు పెరుగుతూనే ఉంటుంది అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అంచనా. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం దేశ సగటు ధరల వృద్ధి రేటు 20 నుండి 22 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసింది.
తాజావార్తలు
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
-
India Tractor Sales: ఒక్క నెలలో 83,000 ట్రాక్టర్లు సేల్.. ఈ బ్రాండ్ కే జై కొట్టిన రైతులు
-
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్పై దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!