Asha Workers: కరీంనగర్ లో ఉద్రిక్తత.. మంత్రి గంగుల ఇంటి ముందు ఆశా వర్కర్ల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asha Workers: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఆశా వర్కర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉన్నా విధులు నిర్వహిస్తున్నామని వాపోతున్నారు. తమ జీతాలు పెంచాలంటూ ఆశా వర్కర్లు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలంటూ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత కొద్ది రోజులుగా ఆశ వర్కర్లు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆశ వర్కర్లు నినాదాలు చేపట్టారు. మంత్రి గంగుల బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు పోరాడుతాం అంటూ ఆశ వర్కర్లు నినాదాలు చేస్తున్నారు. అయితే గంగుల ఇంటి ముందు గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. గంగుల ఇంట్లోకి చొరబడేందుకు ఆశావర్కర్లు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆశావర్కర్లకు వాగ్వాదం చోటుచేసుకుంది.
Read also: Hyderabad Man Kills in London: లండన్లో హైదరాబాద్ వాసి దారుణ హత్య.. కూతురి పెళ్లి కోసం వస్తుండగా..!
Also Read
ఎలాంటి షరతులు లేకుండా ఆశా వర్కర్ల డిమాండ్ మేరకు నెలకు రూ.18 వేలు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరిన విషయం తెలిసిందే.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆశా వర్కర్లు దీక్షలు చేస్తున్నారు. సోమవారం కొండాపూర్, సదాశివపేటల్లోని దీక్షా శిబిరాలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, ఆశా వర్కర్లకు అండగా నిలుస్తామన్నారు. ఆశా వర్కర్ల డిమాండ్లన్నీ న్యాయమైనవే. ఆశా వర్కర్లు ఎప్పుడైనా తమ విధులను నిర్వహిస్తారని, రాష్ట్రం కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా వారు తమ కుటుంబాలకు దూరంగా సేవలందించారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారని, ప్రతి వెయ్యి మందికి ఒక ఆశా వర్కర్ ఉండాల్సి ఉండగా కొన్ని చోట్ల రెండు వేల మందికి ఒక్కరే పనిచేస్తున్నారని తెలిపారు. అందుకే ఆశా వర్కర్లకు పనిభారం పెరగడంతోపాటు ఆన్లైన్ వర్క్ కూడా పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆశా వర్కర్లకు లక్ష్యం మేరకు వేతనాలు ఇస్తున్నారని, లక్ష్యం నెరవేరకపోతే జీతం కూడా తగ్గిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నా వారికి తగిన జీతం, సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఆశా వర్కర్లు వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్నప్పటికీ వారికి హెల్త్ కార్డులు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఎలాంటి షరతులు లేకుండా నెలకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలని, వారి కుటుంబాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
Ponguleti: కాంగ్రెస్ అంటేనే గ్రూపులు.. గ్రూపులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టే కాదు
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!