Pakistan Economic Crisis: గడ్డి తినైనా అణుబాంబు తయారు చేస్తామన్న పాక్.. ఇప్పుడు నిజంగా గడ్డి తినే పరిస్థితే వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
pakistan economic crisis: గడ్డి తినైనా మేం అణుబాంబును తయారు చేస్తాం అని 1970ల్లో పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో అన్నాడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వద్ద అణు బాంబులు ఉన్నాయి. కానీ తినడానికి తిండి దొరికే పరిస్థితి లేదు. నిజంగా పాకిస్తాన్ ప్రజలు గడ్డి తిని బతికే పరిస్థితి వచ్చింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోబోతోంది. విదేశీమారక నిల్వలు తరిగిపోయాయి. దీంతో ఇక పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని అప్పుల కోసం అడుగుతోంది. అయితే భారత్ ను మాత్రం సాయం అడిగేందుకు ఈగో అడ్డువస్తోంది. కనీసం భారత్ ను, ప్రధాని మోదీని సాయం అడిగితే టమాటా, గోధుమలు, ఆలుగడ్డలైనా వస్తాయంటూ అక్కడి మీడియా కథనాలను ప్రచురిస్తోంది.
ప్రస్తుతం విదేశీమారక నిల్వలను కాపాడుకునేందుకు పాక్ దిగుమతులను తగ్గించింది. అయితే ఇది ఎన్నిరోజులనేది తెలియదు. ఎందుకంటే పాక్ పూర్తిగా దిగుమతులపై ఆధారపడిన దేశం కాబట్టి. ఇక అక్కడ ఆహార సంక్షోభంతో పాటు విద్యుత్, గ్యాస్ సంక్షోభాలు రానున్నాయి. పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా కూడా పాకిస్తాన్ తో లాభం లేదనుకుని సాయం చేయడం లేదు. యూఎస్ కూడా పట్టించుకోవడం లేదు. ఇక మిగతా అరబ్ దేశాలు అప్పులిచ్చే పరిస్థితి లేదని పాక్ కు తెగేసి చెబుతున్నాయి. అయితే ఐఎంఎఫ్ ప్యాకేజ్ కోసం పాక్ ప్రయత్నిస్తోంది. అయితే ఐఎంఎఫ్ షరతులకు ఒప్పుకుంటే ఇప్పటికే దయనీయ పరిస్థితుల్లో ఉన్న పాక్ జనాభా మరింతగా పేదరికంలో కూరుకుపోవడం ఖాయం.
Also Read
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే...!
Read Also: Sharwanand: ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. రామ్చరణ్ దంపతులు హాజరు
దిగుమతుల కోసం వచ్చిన కంటెనర్ షిప్పులు పాకిస్తాన్ ఓడరేవుల్లో నిలిచి ఉన్నాయి. అయితే వీటికి చెల్లించేందుకు మాత్రం పాక్ వద్ద డాలర్ల లేవు. సంక్షోభం నడుమ అక్కడి కంపెనీలు మూతపడ్డాయి. ఆటోమోబైల్ దిగ్గజాలు పాక్ సుజుకీ, టయోటా కంపెనీలు తమ కార్యకలాపాలను బంద్ చేశాయి. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీలంక పరిస్థితే పాకిస్తాన్ కు వచ్చే అవకాశం దాదాపుగా ఖాయం అయినట్లే తెలుస్తోంది. మే నెలలో పాకిస్తాన్ డిఫాల్ట్ అవుతుందని అంచానా వేస్తున్నారు ఆర్థికవేత్తలు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి గవర్నమెంట్ జీతాల్లో 10 శాతం, మంత్రుల ఖర్చుల్లో 15 శాతం కోత విధించింది.
వరదల కారణంగా అక్కడి వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. సారవంతమైన భూములు కొట్టుకుపోయాయి. దీంతో గోధుమల సంక్షోభం పాక్ ను వేధిస్తోంది. 10 కిలోల గోధుమ పిండి రూ. 3 వేలను దాటింది. ఒక్క బస్తా కోసం ముగ్గురు నలుగురు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ద్రవ్యోల్భనం గరిష్టస్థాయికి వెళ్లి నిత్యావసరాల ధరలు పెరిగాయి. వచ్చే నెలలో గ్యాస్ సంక్షోభం ఏర్పడవచ్చు. లోవోల్టేజ్ కారణంగా అక్కడి విద్యుత్ కష్టాలు ఏర్పడ్డాయి. చివరకు రాజధాని ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ నగరాలకు కూడా కరెంట్ లేని పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే ఇక పాకిస్తాన్ లో పలు ప్రాంతాలు తాము స్వతంత్ర దేశాలుగా మారుతామంటూ నిరసన, ఆందోళనలు చేస్తున్నాయి. ఒక్క పంజాబ్ మినహా సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పీఓకేలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చివరికి గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంత ప్రజలు తమను భారత్ లో కలుపుకోవాలని నిరసనలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..