Taliban – Pakistan Meeting: ఊపిరి పీల్చుకున్న దాయాది.. దోహాలో పాక్-ఆఫ్ఘన్ సమావేశం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban – Pakistan Meeting: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలలో భారీ కాల్పులు, బాంబు దాడుల తరువాత ప్రస్తుతం రెండు వైపులా కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాజాగా ఆఫ్ఘన్ మీడియా.. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లు, పాక్తో చర్చలు జరపవచ్చని నివేదించింది. ఈ సమావేశంలో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై ఇరు వర్గాలు చర్చించే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి మౌల్వీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ నాయకత్వం వహిస్తారని సమాచారం. పాకిస్థాన్ ప్రతినిధి బృందంలో అనేక మంది సీనియర్ భద్రతా, నిఘా అధికారులు ఉంటారని తెలుస్తుంది. అయితే ఈ చర్చలపై ఇరు దేశాల ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
READ ALSO: Fraud: పేరుకు డాక్టర్లు చేసేది మోసాలు.. చిట్టీల పేరుతో రూ. 150 కోట్లు స్వాహా..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ఆఫ్ఘన్ -పాక్ సమస్య పరిష్కారమవుతుందా?
బుధవారం పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ వేర్వేరు ప్రకటనలు జారీ చేస్తూ, సరిహద్దులో రోజుల తరబడి కాల్పుల విరమణను ప్రకటించాయి. కాల్పుల విరమణ ప్రకటనకు ముందు పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి.
కాబూల్పై వైమానిక దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘన్.. పాకిస్థాన్ పోలీసు శిక్షణా కేంద్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడిలో అనేక మంది భద్రతా సిబ్బంది మరణించారు. దీని తరువాత పాక్ మళ్లీ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. పలు నివేదికల ప్రకారం.. పాక్ సైన్యం ఆఫ్ఘన్లోని నివాస ప్రాంతంపై దాడి చేసి, అనేక మంది పౌరులను చంపింది. గతంలో పాక్ అధికారులు క్వెట్టాలో నివసించే వారి ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేయమని వారం గడువు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆఫ్ఘన్ ఆన్లైన్ ఖామా న్యూస్ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పేర్కొంది.
పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదం కొత్తది కానప్పటికీ, TTP రహస్య స్థావరాలపై అణిచివేతపై ఇటీవల వివాదం తీవ్రమైంది. కాబూల్, ఇతర ప్రాంతాలలోని పాకిస్థానీ తాలిబాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు దాయాది దేశం పేర్కొంది. కానీ ఆఫ్ఘనిస్థాన్ ఇది తన సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలు దాదాపు యుద్ధంగా మారాయి. తాజాగా ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం ఎన్ని రోజులు అమలులో ఉంటాయో తెలియదు. దోహాలో ఇరుదేశాల ప్రతినిధులు సమావేశం కావడంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
READ ALSO: Gujarat Cabinet 2025: గుజరాత్ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. జడేజా సతీమణికి ఏ శాఖ కేటాయించారంటే..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!