Taliban – Pakistan Meeting: ఊపిరి పీల్చుకున్న దాయాది.. దోహాలో పాక్-ఆఫ్ఘన్ సమావేశం?
Taliban – Pakistan Meeting: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలలో భారీ కాల్పులు, బాంబు దాడుల తరువాత ప్రస్తుతం రెండు వైపులా కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాజాగా ఆఫ్ఘన్ మీడియా.. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లు, పాక్తో చర్చలు జరపవచ్చని నివేదించింది. ఈ సమావేశంలో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై ఇరు వర్గాలు చర్చించే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి మౌల్వీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ నాయకత్వం వహిస్తారని సమాచారం. పాకిస్థాన్ ప్రతినిధి బృందంలో అనేక మంది సీనియర్ భద్రతా, నిఘా అధికారులు ఉంటారని తెలుస్తుంది. అయితే ఈ చర్చలపై ఇరు దేశాల ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
READ ALSO: Fraud: పేరుకు డాక్టర్లు చేసేది మోసాలు.. చిట్టీల పేరుతో రూ. 150 కోట్లు స్వాహా..
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ఆఫ్ఘన్ -పాక్ సమస్య పరిష్కారమవుతుందా?
బుధవారం పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ వేర్వేరు ప్రకటనలు జారీ చేస్తూ, సరిహద్దులో రోజుల తరబడి కాల్పుల విరమణను ప్రకటించాయి. కాల్పుల విరమణ ప్రకటనకు ముందు పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి.
కాబూల్పై వైమానిక దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘన్.. పాకిస్థాన్ పోలీసు శిక్షణా కేంద్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడిలో అనేక మంది భద్రతా సిబ్బంది మరణించారు. దీని తరువాత పాక్ మళ్లీ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. పలు నివేదికల ప్రకారం.. పాక్ సైన్యం ఆఫ్ఘన్లోని నివాస ప్రాంతంపై దాడి చేసి, అనేక మంది పౌరులను చంపింది. గతంలో పాక్ అధికారులు క్వెట్టాలో నివసించే వారి ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేయమని వారం గడువు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆఫ్ఘన్ ఆన్లైన్ ఖామా న్యూస్ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పేర్కొంది.
పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదం కొత్తది కానప్పటికీ, TTP రహస్య స్థావరాలపై అణిచివేతపై ఇటీవల వివాదం తీవ్రమైంది. కాబూల్, ఇతర ప్రాంతాలలోని పాకిస్థానీ తాలిబాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు దాయాది దేశం పేర్కొంది. కానీ ఆఫ్ఘనిస్థాన్ ఇది తన సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలు దాదాపు యుద్ధంగా మారాయి. తాజాగా ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం ఎన్ని రోజులు అమలులో ఉంటాయో తెలియదు. దోహాలో ఇరుదేశాల ప్రతినిధులు సమావేశం కావడంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
READ ALSO: Gujarat Cabinet 2025: గుజరాత్ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. జడేజా సతీమణికి ఏ శాఖ కేటాయించారంటే..
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!