Sourav Ganguly-PCB: రంగంలోకి సౌరవ్ గంగూలీ.. ఇక పీసీబీ అడుక్కు తినాల్సిందే!
- భారత్, పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి
- పహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన గంగూలీ
- పాక్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచేసుకోవాలి
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. 2008లో ముంబై పేలుళ్ల తర్వాత బీసీసీఐ పాకిస్థాన్ను నిషేదించింది. 2012-13 నుంచి ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇరు దేశాలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. తాజా టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో పాకిస్థాన్తో ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. టీమిండియాతో ఆడకపోతే పాకిస్థాన్కు పుట్టగతులుండవని, భారత్ జరిగే మ్యాచ్ల ద్వారా పాక్ క్రికెట్ బోర్డుకు కోట్లాది రూపాయలు వస్తున్నాయని, ఇకనైనా పాకిస్థాన్తో భారత్ పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పహల్గాం ఉగ్రదాడిపై స్పందించారు. పాకిస్థాన్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని బీసీసీఐని దాదా కోరారు. భారత్పై జరిపిన టెర్రర్ ఎటాక్కు గట్టిగా సమాధానమివ్వాలని విజ్ఞప్తి చేశారు. కోల్కతాలో విలేకరులతో మాట్లాడిన గంగూలీ.. ‘ప్రతి ఏడాది ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రదాడులపై మనం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. టెర్రరిజాన్ని ఏమాత్రం సహించేది లేదు. పాక్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచేసుకోవాలి. అది జరిగి తీరాల్సిందే. ఈ విషయంలో వేరే ఆలోచన పెట్టుకోవద్దు’ అని దాదా సీరీయస్ అయ్యారు.
Also Read
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇండో-పాక్ జట్లు తలపడుతున్నాయి. ఐసీసీ నిర్వహించే టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్లలో మాత్రమే తలపడుతున్నాయి. భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్కు వెళ్లింది. తప్పనిసరి పరిస్థితుల్లో వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత్కు పాకిస్తాన్ వచ్చింది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ నిర్వహించగా.. తటస్థ వేదికలో టీమిండియా ఆడిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!