OYO: ఓయోలోనూ ఉద్యోగాల కోత.. 600 మంది తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OYO: దేశీయ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. బైజూస్, జొమాటో వంటి దేశీయ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. తాజాగా ఓయో కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ టీమ్లలో 600 ఎగ్జిక్యూటివ్లను తొలగించనున్నట్లు పేర్కొంది. అలాగే సేల్స్ విభాగంలో 250 మంది ఎగ్జిక్యూటివ్లను నియమిస్తున్నట్లు కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఓయోలో ప్రధానంగా 3700 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా… వ్యాపార నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి 10 శాతం ఉద్యోగాలు తగ్గించాలని కంపెనీ చూస్తోంది. దానిలో భాగంగా కంపెనీ ఇంజనీరింగ్, కార్పొరేట్ విభాగంలో టీమ్లను తగ్గిస్తోంది.
సంస్థాగత నిర్మాణంలో విస్తృతమైన మార్పులను అమలు చేయడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ఓయో తెలిపింది. ప్రొడక్ట్ అండ్ ఇంజినీరింగ్, కార్పొరేట్ హెడ్క్వార్టర్స్, ఓయో వెకేషన్ టీమ్స్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించనుండగా.. రిలేషన్షిప్, బిజినెస్ డెవలప్మెంట్ టీమ్లో కొత్తగా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. అదే సమయంలో ప్రత్యేకంగా, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి దాని ప్లాట్ఫారమ్లోని హోటళ్లు, గృహాల సంఖ్యను పెంచడంలో సహాయపడటానికి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టీమ్లలో 250 మందిని కొత్తగా చేర్చుకోనుంది. ఉద్యోగులను తొలగించాల్సి రావడం దురదృష్టకరమని ఓయో వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల పాటు మెడికల్ ఇన్సురెన్స్ కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్లో ఆయా విభాగాల్లో నియామకాలు చేపట్టినప్పుడు తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Mass Killings: సామూహిక హత్యలు జరిగే దేశాల జాబితాలో పాకిస్థాన్దే అగ్రస్థానం!
గత రెండేళ్లలో ఓయో ఇలా ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. 2020 డిసెంబర్లో కంపెనీ 300 మంది ఉద్యోగులను తొలగించింది. యాప్ గేమింగ్, సోషల్ కంటెంట్ క్యూరేషన్ వంటి విభాగంలో కూడా టెక్నికల్ సిబ్బందిని తగ్గించనుంది. కంపెనీ ప్రస్తుతం ఐపీవోకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఓయో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో రూ. 63 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!