Potatoes Export: ఆగ్రా నుంచి మలేషియా, ఖతార్, దుబాయ్లకు 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Potatoes Export: కూరగాయలలో రారాజుగా పిలువబడే బంగాళాదుంపకు భారతదేశం వెలుపల ఉన్న దేశాలలో చాలా డిమాండ్ ఉంది. బంగాళాదుంపలు భారతదేశంలో సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ, కూరగాయలను విదేశాలలో అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. మలేషియా, ఖతార్, దుబాయ్లోని హోటళ్లు, గృహాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆగ్రా నుంచి సుమారు 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలు ఎగుమతి అవుతున్నాయి. ఇవాళ బంగాళదుంపలతో లోడ్ చేయబడిన ట్రక్కులను ఆగ్రా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎ మణికందన్ జెండా ఊపి ప్రారంభించారు. బంగాళాదుంపల ఎగుమతి కోసం రైతులకు క్వింటాల్కు రూ.900 చెల్లించామని.. ప్రభుత్వం కొనుగోలు ధర క్వింటాల్కు రూ.650గా నిర్ణయించిందని చెప్పారు. ఈ పరిస్థితిలో బంగాళాదుంపలను ఎగుమతి చేయడం రైతులకు లాభదాయకమని పేర్కొన్నారు.
హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఉత్తరప్రదేశ్ స్టేట్ హార్టికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ సహకారంతో సిద్ధి వినాయక్ ఆగ్రో ప్రాసెసింగ్ ఖండౌలీ (ఆగ్రా) 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలను బంగాళాదుంప రైతులకు అత్యుత్తమంగా ఉండేలా విదేశాలకు ఎగుమతి చేసింది. దాదాపు 3000 క్వింటాళ్ల బంగాళదుంపలు మలేషియాకు, 3000 క్వింటాళ్ల బంగాళదుంపలను దుబాయ్, ఖతార్లకు పంపారు. ఆగ్రా నుంచి గుజరాత్లోని హిమ్మత్నగర్కు చాలా ట్రక్కుల్లో బంగాళాదుంపలు రవాణా చేయబడ్డాయి. అక్కడ అవి ముంద్రా పోర్ట్ ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయబడతాయి. ఈ ఎల్ఆర్ రకం బంగాళదుంపను క్వింటాల్కు రూ.900 చొప్పున ఎగుమతి చేశారు. బంగాళాదుంప రైతు మురారిలాల్ మాట్లాడుతూ, ఆగ్రాలోని మిధాకూర్ పట్టణంలోని వారంవారీ సంతలో కిలో రూ.4 చొప్పున బంగాళాదుంపలను విక్రయిస్తున్నారని, నిమ్మకాయ ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. బంగాళదుంపల పట్ల ఇంత ఉదాసీనత చాలా సంవత్సరాలుగా కనిపించలేదని మార్కెట్లో కూరగాయలు విక్రయించే నాగ్లా లాల్దాస్ నివాసి నిరౌతి లాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం కిలో బంగాళదుంప రూ.4 మాత్రమే ఉండగా కిలో నిమ్మకాయ రూ.200 పలుకుతోంది.పచ్చిమిర్చి కిలో రూ.100 నుంచి 150, అల్లం కిలో రూ.800 నుంచి 100 పలుకుతోంది.
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
Read Also: Air Force Helicopter: తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం బంగాళదుంప సాగుకు అయ్యే ఖర్చును రికవరీ చేయడం కష్టమని రైతులు బంగాళాదుంప సాగును తగ్గించి ఇతర కూరగాయల సాగుపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని హిందుస్థానీ బిరాదారి వైస్ చైర్మన్ విశాల్ శర్మ పేర్కొన్నారు. బంగాళాదుంప సాగు విస్తీర్ణం తగ్గితే బంగాళదుంపలకు గిరాకీ పెరుగుతుంది, ధర పెరుగుతుంది. అదీ పక్కన పెడితే అధునాతన బంగాళదుంప రకాల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. విదేశాలలో అధిక డిమాండ్ ఉన్న ఇటువంటి రకాలను పండించాలి, ఎందుకంటే భారతీయ మార్కెట్లో బంగాళదుంపలకు మంచి ధరలు అందుబాటులో లేవు, అయితే విదేశాలకు ఎగుమతి చేసే బంగాళాదుంపలకు మంచి ధరలు లభిస్తాయి.
తాజావార్తలు
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!