Operations Sindoor : పాక్ పరువు పోయింది.. మేం ఏం చేయలేం అంటూ వీడియోలు
- భారత దాడులతో పాక్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
- లక్ష్యాన్ని తాకిన 24 మిస్సైళ్లను అడ్డుకోలేని పాక్ రక్షణ వ్యవస్థ
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై పౌరుల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operations Sindoor : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడులు పాకిస్తాన్లోని సాధారణ పౌరుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. తమ దేశ రక్షణ వ్యవస్థ బలహీనతను ఎత్తిచూపుతూ, భారత్ విజయవంతమైన దాడులను వారు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పాకిస్తానీ పౌరుడు మాట్లాడుతూ, “భారత్ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. మా రక్షణ వ్యవస్థ ఒక్క మిస్సైల్ను కూడా అడ్డుకోలేకపోయింది. ఏకంగా 24 మిస్సైల్స్ను వారు ప్రయోగించినా, వాటిలో ఒక్కదాన్ని కూడా మా సైన్యం నిలువరించలేకపోయింది. మా దేశం ఏ మాత్రం ప్రతిస్పందించలేకపోయింది” అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారతదేశం ఉగ్రవాదుల శిబిరాలపైనే దాడి చేసిందని, ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
CM Revanth Reddy : భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ
Also Read
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
“పాక్ స్థావరాలపై దాడి చేసిన తర్వాత మేం చేసేది ఏమీ లేదు. మా బలహీనతను ప్రపంచం ముందు భారత్ చాటి చెప్పింది” అని ఆయన ఆవేదన చెందారు. దేశంలోని కొందరు వ్యక్తులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో, భారత యుద్ధ విమానాలను కూల్చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. “వాస్తవానికి జరిగింది వేరు. మా అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ఈ దాడులను అడ్డుకోవడంలో పాకిస్తాన్ వైఫల్యం అక్కడి ప్రజల్లో తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తమ దేశ రక్షణ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్గత రాజకీయ పరిస్థితులను మరింత అస్థిరపరిచే అవకాశం ఉంది.
Guntur Crime: ట్రాంజెండర్తో ఎఫైర్..! తప్పు అని చెప్పినందుకు దారుణ హత్య..
తాజావార్తలు
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!