Operations Sindoor : పాక్ పరువు పోయింది.. మేం ఏం చేయలేం అంటూ వీడియోలు
- భారత దాడులతో పాక్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
- లక్ష్యాన్ని తాకిన 24 మిస్సైళ్లను అడ్డుకోలేని పాక్ రక్షణ వ్యవస్థ
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై పౌరుల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operations Sindoor : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడులు పాకిస్తాన్లోని సాధారణ పౌరుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. తమ దేశ రక్షణ వ్యవస్థ బలహీనతను ఎత్తిచూపుతూ, భారత్ విజయవంతమైన దాడులను వారు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పాకిస్తానీ పౌరుడు మాట్లాడుతూ, “భారత్ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. మా రక్షణ వ్యవస్థ ఒక్క మిస్సైల్ను కూడా అడ్డుకోలేకపోయింది. ఏకంగా 24 మిస్సైల్స్ను వారు ప్రయోగించినా, వాటిలో ఒక్కదాన్ని కూడా మా సైన్యం నిలువరించలేకపోయింది. మా దేశం ఏ మాత్రం ప్రతిస్పందించలేకపోయింది” అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారతదేశం ఉగ్రవాదుల శిబిరాలపైనే దాడి చేసిందని, ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
CM Revanth Reddy : భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
“పాక్ స్థావరాలపై దాడి చేసిన తర్వాత మేం చేసేది ఏమీ లేదు. మా బలహీనతను ప్రపంచం ముందు భారత్ చాటి చెప్పింది” అని ఆయన ఆవేదన చెందారు. దేశంలోని కొందరు వ్యక్తులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో, భారత యుద్ధ విమానాలను కూల్చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. “వాస్తవానికి జరిగింది వేరు. మా అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ఈ దాడులను అడ్డుకోవడంలో పాకిస్తాన్ వైఫల్యం అక్కడి ప్రజల్లో తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తమ దేశ రక్షణ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్గత రాజకీయ పరిస్థితులను మరింత అస్థిరపరిచే అవకాశం ఉంది.
Guntur Crime: ట్రాంజెండర్తో ఎఫైర్..! తప్పు అని చెప్పినందుకు దారుణ హత్య..
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!