Operation Sindoor : భారత దాడిలో జైషే టాప్ కమాండర్ హతం..!
- పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మెరుపుదాడి
- బహవల్పూర్, మురీద్కేలో ఉగ్ర స్థావరాలపై పిడుగు దాడులు
- మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ హతమయ్యారా అనే అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor : పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి ఇంకా మన కళ్లముందు మెదులుతూనే ఉంది. భార్యల కళ్లెదుటే భర్తలను పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుల చర్య యావత్ భారతావనిని కలచివేసింది. అయితే, ఇప్పుడు ఆ బాధకు ప్రతిస్పందనగా భారత్ గర్జించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రమూకల స్థావరాలపై పిడుగులా విరుచుకుపడింది. భారత సైన్యం పాకిస్తాన్ , పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఏకంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ మెరుపు దాడులు జరిగాయి.
ఈ దెబ్బతో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే, అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే – ఈ దాడిలో భారత దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉగ్రనేతలు హఫీజ్ సయీద్ , మసూద్ అజహర్ హతమయ్యారా?
Also Read
మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ హతమయ్యారా?
భారతదేశం మసూద్ అజహర్ ముఖ్య స్థావరమైన బహవల్పూర్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ స్ట్రైక్లో వారి ప్రధాన కార్యాలయం , మదర్సా నేలమట్టం అయ్యాయి. పాకిస్తాన్ మీడియా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ దాడిలో జైష్-ఎ-మహ్మద్కు చెందిన దాదాపు 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
అంతేకాకుండా, మురీద్కేలోని లష్కర్-ఎ-తైబా స్థావరాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో లష్కర్ , జైష్కు చెందిన పలువురు టాప్ కమాండర్లు హతమయ్యారు. అయితే, ఈ దాడుల్లో మసూద్ అజహర్ , హఫీజ్ సయీద్ మరణించినట్లు అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు.
భారతదేశం చేసిన ఈ దాడుల అనంతరం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ దాడిని ఆయన స్వయంగా ధృవీకరించారు. “భారత్ మాపై యుద్ధం ప్రకటించింది. మాకు తిప్పికొట్టే హక్కు ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత సైన్యం మెరుపువేగంతో విరుచుకుపడిన ప్రాంతాలివే:
ముజఫరాబాద్లో 2 స్ట్రైక్లు, బహవల్పూర్లో 3వ స్ట్రైక్, కోట్లీలో 4వ , చాక్ అమ్రూలో 5వ దాడి, గుల్పూర్లో 6వ , భింబర్లో 7వ దాడి, మురీద్కేలో 8వ, సియాల్కోట్లో 9వ దాడి.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!