Operation Sindoor : భారత దాడిలో జైషే టాప్ కమాండర్ హతం..!
- పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మెరుపుదాడి
- బహవల్పూర్, మురీద్కేలో ఉగ్ర స్థావరాలపై పిడుగు దాడులు
- మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ హతమయ్యారా అనే అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor : పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి ఇంకా మన కళ్లముందు మెదులుతూనే ఉంది. భార్యల కళ్లెదుటే భర్తలను పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుల చర్య యావత్ భారతావనిని కలచివేసింది. అయితే, ఇప్పుడు ఆ బాధకు ప్రతిస్పందనగా భారత్ గర్జించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రమూకల స్థావరాలపై పిడుగులా విరుచుకుపడింది. భారత సైన్యం పాకిస్తాన్ , పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఏకంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ మెరుపు దాడులు జరిగాయి.
ఈ దెబ్బతో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే, అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే – ఈ దాడిలో భారత దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉగ్రనేతలు హఫీజ్ సయీద్ , మసూద్ అజహర్ హతమయ్యారా?
Also Read
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ హతమయ్యారా?
భారతదేశం మసూద్ అజహర్ ముఖ్య స్థావరమైన బహవల్పూర్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ స్ట్రైక్లో వారి ప్రధాన కార్యాలయం , మదర్సా నేలమట్టం అయ్యాయి. పాకిస్తాన్ మీడియా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ దాడిలో జైష్-ఎ-మహ్మద్కు చెందిన దాదాపు 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
అంతేకాకుండా, మురీద్కేలోని లష్కర్-ఎ-తైబా స్థావరాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో లష్కర్ , జైష్కు చెందిన పలువురు టాప్ కమాండర్లు హతమయ్యారు. అయితే, ఈ దాడుల్లో మసూద్ అజహర్ , హఫీజ్ సయీద్ మరణించినట్లు అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు.
భారతదేశం చేసిన ఈ దాడుల అనంతరం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ దాడిని ఆయన స్వయంగా ధృవీకరించారు. “భారత్ మాపై యుద్ధం ప్రకటించింది. మాకు తిప్పికొట్టే హక్కు ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత సైన్యం మెరుపువేగంతో విరుచుకుపడిన ప్రాంతాలివే:
ముజఫరాబాద్లో 2 స్ట్రైక్లు, బహవల్పూర్లో 3వ స్ట్రైక్, కోట్లీలో 4వ , చాక్ అమ్రూలో 5వ దాడి, గుల్పూర్లో 6వ , భింబర్లో 7వ దాడి, మురీద్కేలో 8వ, సియాల్కోట్లో 9వ దాడి.
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!