Online Love Scam: ఇలా ఉన్నారేంట్రా బాబు.. వాట్సప్ లోనే పరిచయం.. ప్రేమ..పెళ్లి.. కాపురం!
- రోజురోజుకి పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలు.
- ఆన్లైన్ లోనే పరిచయం.. ప్రేమ..పెళ్లి.. కాపురం కానిచేస్తున్న యువత.
- ఫిలింనగర్లో బయటపడ్డ ఆన్లైన్ సంసార బాగోతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Love Scam: ఈ డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ వలన పరస్పర సంబంధాలు సులభంగా ఏర్పడుతున్నప్పటికీ, దుర్వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా పరిచయమై, ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడే సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఫిలింనగర్లో ఇలాంటి ఒక వింత కేసు నమోదైంది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
సౌదీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఆహాద్ అనే యువకుడు, ఒక భారతీయ మహిళతో వాట్సప్లో పరిచయమై ప్రేమలోకి దించాడు. కొంతకాలం ప్రేమ తర్వాత, వీరు వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం వీరి సంభాషణలు పూర్తిగా ఆన్లైన్ లోనే కొనసాగాయి. ఈ జంట సంవత్సరం పాటు ఆన్లైన్ ద్వారా దాంపత్య జీవితాన్ని కొనసాగించారు కూడా. అయితే, పెళ్లి తర్వాత కొంత కాలం గడిచిన తర్వాత మహిళకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపాలంటూ ఒత్తిడి పెంచడం ప్రారంభించాడు. ఎలాగో పెళ్లి అయ్యిందకదా అని సదరు మహిళా ఫోటోలు, వీడియోలు పంపింది. ఆ తర్వాత మోసగాడి అసలు స్వరూపం బయట పడింది. గత కొంతకాలంగా మహిళకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బహిరంగం చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఈ పనిలో అతనితో పాటు అతని మొదటి భార్య కూడా సహకరించిందని మహిళ ఆరోపిస్తోంది.
ఈ ఘటనతో మహిళ తన భర్త గురించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని భావించి విచారణ ప్రారంభించింది. ఈ అన్వేషణలో అతనికి ఆమెతో మొదటి పెళ్లి కాదని, ఇప్పటికే ముగ్గురిని వివాహం చేసుకున్నాడని తెలిసింది. అసలు విషయం తెలుసుకున్న ఆమె వెంటనే ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయాన్ని తెలుసుకున్న ఆమె మహ్మద్ అబ్దుల్ ఆహాద్, అతని మొదటి భార్యపై వివిధ సెక్షన్ల కింద ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపడుతోంది.
Read Also: MLC Elections 2025: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!
ఈ సంఘటన నుండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులపై పూర్తిగా విశ్వాసం పెట్టకూడదు. ముఖ్యంగా వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు భాగస్వామ్యం చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులతో డబ్బు లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం ప్రమాదకరం. ప్రస్తుతం సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యక్తిగత సమాచారం, నమ్మకాన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. అందుకే, వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుమానాస్పదమైన ఘటన ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించడం మంచిది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..