Gachibowli Stadium: 200 మంది ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన.. కారణమేంటంటే..?
- గచ్చిబౌలి స్టేడియం వద్ద 200 మంది ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన
- కి.మీ 18 నుండి 20 రూపాయలు చెల్లించేటట్టు ఒప్పందం
- ఇప్పుడు రూ.6 నుంచి 9 రూపాయలు కేటాయిస్తున్న ఓలా, ఉబర్ కంపెనీలు
- 30 కిలోమీటర్ల దూరానికి రూ.350 సరిపోవటం లేదంటూ డ్రైవర్లు ఆందోళన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం వద్ద ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దాదాపు 200 మంది ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు నిరసన చేపట్టారు. కిలోమీటర్కి 18 నుండి 20 రూపాయలు చెల్లించేటట్టు ఓలా, ఉబర్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం కిలోమీటర్కి 6 నుంచి 9 రూపాయలు కేటాయిస్తున్నాయి. అంతేకాకుండా.. తమకు వచ్చిన ఛార్జెస్ లో నుండి కంపెనీలు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్ట్ వెళితే 600 రూపాయలు చెల్లించేవని.. ప్రస్తుతం 300 నుండి 350 రూపాయలు చెల్లిస్తున్నట్లు క్యాబ్ డ్రైవర్లు ఆరోపించారు. 30 కిలోమీటర్ల దూరానికి 350 రూపాయలు సరిపోవటం లేదంటూ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.
Read Also: IPL 2025: ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఓపెనింగ్ మ్యాచ్కు వర్షం ముప్పు..!
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
పాత తరహాలోనే కిలోమీటర్ కి 18 నుండి 20 రూపాయలు కేటాయించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఇతర రాష్ట్రాల వాహనాలు ఓలా, ఉబర్ లలో నడవడంతో తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్ నుండి ఎయిర్ పోర్ట్ వెళితే కస్టమర్ దగ్గర నుండి ఓలా, ఉబర్ కంపెనీలు 850 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. తమకు మాత్రం అదే ట్రిప్పుకు 450 రూపాయలు చెల్లిస్తున్నట్లు వాపోయారు. ఓలా, ఉబర్ కంపెనీలు ఒక ట్రిప్పు పై 400 రూపాయలు కమీషన్ తీసుకుంటున్నాయని పేర్కొ్న్నారు. ఈ 400 రూపాయలలో కూడా 5 శాతం పర్సన్ జీఎస్టీ పేరున కంపెనీలు కట్ చేస్తున్నాయని తెలిపారు. ఏపీ వాహనాలను నంబర్ ప్లేట్లు మార్చి ఓలా, ఉబర్లలో నడుపుతున్నారని.. తెలంగాణ స్టేట్ కి రోడ్డు టాక్స్ కట్టి తాము వాహనాలు నడుపుతున్నామని డ్రైవర్లు చెప్పారు. నంబర్ ప్లేట్లు మార్చి వాహనాలు నడుపుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఓలా, ఉబర్ డ్రైవర్లు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!