Reservoir Lifting Effect: ఈ సెల్పీ చాలా కాస్లీ గురూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reservoir Lifting Effect: అతనో ప్రభుత్వ ఉద్యోగి.. సరదా కోసం ఒక డ్యామ్ దగ్గర సెల్ఫీ తీసుకున్నాడు. సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తన చేతిలోని ఫోన్ కాస్త రిజర్వాయర్లో పడిపోయింది. ఫోన్ విలువైందని తనకు తిరిగి ఫోన్ కావాలని భావించాడు. డ్యామ్లోని నీటిని మోటార్లు పెట్టి తోడించాడు.. మూడు రోజుల అనంతరం అతనికి ఫోన్ దొరికింది. ఈ లోపు విషయం కాస్త ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.. ఇపుడు ప్రజలకు తాగు, సాకు కోసం ఉపయోగపడే నీటిని వృదా చేసినందుకు జరిమాన ఎందుకు విధించకూడదో చెప్పాలని నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఛత్తీస్గఢ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ తన ఖరీదైన ఫోన్ను రికవరీ చేయడానికి రిజర్వాయర్ నుండి 21 లక్షల లీటర్ల నీటిని తీసివేసినందుకు సస్పెండ్ చేయబడిన కొన్ని రోజుల తర్వాత, ప్రభుత్వం అతని సీనియర్ను పైకి లాగింది, అతను ఐదు అడుగుల వరకు నీటిని ఖాళీ చేయడానికి మౌఖిక అనుమతి ఇచ్చాడని చెప్పాడు. డ్యామ్లో నీటిని తొలగించమని ఆదేశించినందుకు సీనియర్ అధికారికి ₹ 53,000 జరిమానా విధించబడింది.
ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ తన జీతం నుంచి వృథాగా పోతున్న నీటి ఖర్చును ఎందుకు వసూలు చేయకూడదని సబ్ డివిజనల్ అధికారి ఆర్కే ధివర్కు ఈనెల 26న లేఖ రాశారు. వేసవిలో సాగునీరు, ఇతర అవసరాల కోసం అన్ని రిజర్వాయర్లలో నీరు అవసరమని లేఖలో సూచించారు. కాంకేర్ జిల్లా ఫుడ్ ఆఫీసర్గా పనిచేస్తున్న రాజేశ్ విశ్వాస్ మే 20న తన స్నేహితులతో కలిసి పరల్కోట్ డ్యామ్ సందర్శనకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ రూ.లక్ష విలువైన స్మార్ట్ఫోన్ నీళ్లలో పడిపోయింది. ఖరీదైన ఫోన్ రిజర్వాయర్లో పడిపోవడంతో 15 అడుగుల లోతైన ఆ రిజర్వాయర్ నీటిలో గజ ఈతగాళ్లతో గాలించారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నీటి పారుదల శాఖలో తనకు తెలిసిన అధికారులను సంప్రదించి సాయం కోరాడు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
నీటిపారుదల శాఖ అధికారి నుంచి మౌఖికంగా ఆదేశాలు అందుకున్న సిబ్బంది.. రెండు భారీ మోటార్లతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు 21 లక్షల లీటర్ల నీటిని బయటకు తోడేశారు. వేసవిలోనూ 10 అడుగుల మేర నీళ్లుండే రిజర్వాయర్.. స్థానిక రైతుల సాగుకు, జంతువులకు తాగునీటికి ఉపయోగపడుతోంది. బయటకు తోడేసిన నీటితో 1500 ఎకరాలు సాగు చేయవచ్చు. ఫోన్ కోసం రిజర్వాయర్లోని నీటిని తోడేస్తున్న విషయం వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్పందించిన జలవనరుల శాఖ అధికారులు వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేయించారు.
ఘటనపై రాజేశ్ విశ్వాస్ వివరణ ఇస్తూ తన తప్పేమీ లేదని … ఆ రిజర్వాయర్లోని నీటిని ఏ అవసరాల కోసం వినియోగించడంలేదని, నీళ్లు తోడేస్తే ఫోన్ దొరుకుతుందని స్థానికులు, జల వనరుల శాఖకు చెందిన అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పారని, అందుకే మోటార్లతో నీటిని తోడించేయించినట్టు చెప్పారు.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!