Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Jogi Ramesh

Off The Record : టీడీపీ లీడర్స్ ఆ వైసీపీ నేతకు లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నారా.?

Published Date :July 2, 2024 , 10:18 pm
By Gogikar Sai Krishna
Off The Record : టీడీపీ లీడర్స్ ఆ వైసీపీ నేతకు లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నారా.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఆ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి వైసీపీ మాజీ మంత్రికి లోలోపల థాంక్స్‌ చెప్పుకుంటున్నారట. నీ చేష్టలు, చర్యలే ఇవాళ మమ్మల్ని ఒడ్డున పడేశాయి, ఎంత మంచివాడవు అనుకుంటున్నారట. అదేంటీ… టీడీపీ లీడర్స్‌ వైసీపీకీ నాయకుడికి ధాంక్స్‌ చెప్పడమేంటి? ఆయన వాళ్ళకు చేసిన అంత మేలేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. లెట్స్‌ వాచ్‌. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 13 చోట్ల తెలుగుదేశం, రెండు సీట్లలో బీజేపీ, ఒక నియోజకవర్గంలో జనసేన గెలిచాయి. 2019 ఎన్నికల్లో 14 చోట్ల వైసీపీ విజయం సాధించగా రెండు సెగ్మెంట్స్ మాత్రమే టీడీపీకి దక్కాయి.

కానీ… ఐదేళ్ళు గడితేసరికి సీన్‌ మారిపోయి జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేసేసింది కూటమి. ఈ క్రమంలో ఓ ఇద్దరు అదృష్టవంతుల గురించి చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి కొలుసు పార్థసారథి ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి జంపై టిక్కెట్స్‌ దక్కించుకుని గెలిచారు. తాము పార్టీ మారడం వల్లే గెలవగలిగామని, అలా మారడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి జోగి రమేషేనన్నది వాళ్ళ అంతరంగంగా తెలిసింది. ఆయన పెట్టిన ఇబ్బందుల కారణంగానే వైసీపీ వీడాల్సి వచ్చిందని, ఆ రూపంలో మా నెత్తిన పాలు పోశావంటూ వెటకారంగా థాంక్యూ జోగీ అంటున్నారన్నది లోకల్‌ టాక్‌. వసంత కృష్ణప్రసాద్ 2019లో వైసీపీ తరపున మైలవరంలో మొదటిసారి గెలిచారు. 2014లో ఇక్కడ నుంచి జోగి రమేష్ పోటీ చేసి ఓడిపోవడంతో… ఆయన్ని పెడనకు పంపి ఆ సీటు వసంతకు కేటాయించింది వైసీపీ అధిష్టానం. జోగి స్వస్థలం ఇబ్రహీంపట్నం కావడం, అది మైలవరం సెగ్మెంట్‌లో ఉండటంతో… ఇక్కడ ఆయనకు వర్గం ఉంది. దాంతో 2019లో పెడన నుంచి గెలిచి మంత్రైన తర్వాత నుంచి జోగి మైలవరం వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకునేవారట.

స్థానికంగా ఉన్న ఆయన వర్గం కార్యకర్తలు వివిధ రూపాల్లో ఎమ్మెల్యే వసంతను టార్గెట్‌ చేసుకుని సోషల్ మీడియా పోస్ట్‌లతో ఇబ్బంది పెట్టారన్నది ఆయన వర్గం ఆరోపణ. ఈసారి అసలు వసంతకు టికెట్ కూడా ఇవ్వరన్న ప్రచారంతోపాటు… నియోజకవర్గంలో జోగి మితిమీరిన జోక్యం సెగలు రేపింది. స్వయంగా జగన్‌ జోక్యం చేసుకున్నా… ఈ వివాదం సెటిల్‌ కాలేదు. దీంతో విసుగెత్తిపోయిన వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీని వీడి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. జోగితో గొడవలు రాకుండా అలాగే వైసీపీతో ఉండి ఉంటే… ఇప్పుడు ఓటమి తప్పేది కాదని, అందుకే మాజీ మంత్రికి థ్యాంక్స్‌ అంటూ సెటైరికల్‌గా అంటున్నారట వసంత అనుచరులు. జోగి తీరు వల్ల ఇబ్బందిపడినా చివరకు వసంతకు మంచే జరిగిందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలిసింది. ఇక పెనమలూరు నుంచి 2019లో గెలిచిన కొలుసు పార్థసారధి ఈసారి నూజివీడు నుంచి టీడీపీ తరపున గెలిచి కేబినెట్‌ మంత్రి అయ్యారు. 2014లో సారధిని వైసీపీ అధిష్టానం బందరు ఎంపీ అభ్యర్ధిగా పంపింది. అప్పట్లో ఓడిపోయారాయన. ఇక 2019లో పెనమలూరు నుంచి గెలిచిన సారధి బీసీ కోటాలో మంత్రి పదవి ఆశించారట. అయితే ఆయనకు ఇవ్వకుండా జోగి రమేష్‌ వైపు మొగ్గింది వైసీపీ అధిష్టానం. సీనియర్‌ని అయిన తనకు ఇవ్వరా…. అంటూ మనస్తాపానికిగురైన సారథి తనకు అవమానం జరిగిందంటూ సామాజిక బస్సు యాత్రలోనే పార్టీకి ఝలక్ ఇచ్చి టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అలాగే ఈసారి పెనమలూరు నుంచి కాకుండా గన్నవరం నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం చెప్పటంతో… ఆ వ్యవహారాలతో విసిగిపోయి టీడీపీలో చేరారు పార్థసారధి. చివరికి పెనమలూరు టికెట్ ఇస్తామన్నా వద్దని టీడీపీలో చేరి గెలిచి మంత్రయ్యారు. అటు సారధి వెళ్ళాల్సిన పెనమలూరు నుంచి జోగి రమేష్ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఇక్కడ కూడా జోగి వల్లే సారధికి మంచి జరిగిందంటూ థాంక్స్‌ జోగీ అంటోందట ఆయన వర్గం. మొత్తంగా పార్టీ మారిన ఇద్దరు నాయకులు నీవల్లే… నీవల్లే అంటూ జోగిని గుర్తు చేసుకుంటున్నారని, ఆయన చెడు చేయాలనుకున్నా…వాళ్ళకు మంచే జరిగిందన్నది లోకల్‌ టాక్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap news
  • Jogi Ramesh
  • off the record
  • tdp
  • YSRCP

తాజావార్తలు

  • Dhurandhar 2 :ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్!

  • Suryakumar Yadav: ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా.. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి!

  • Team India playing XI: వరుణ్, అభిషేక్ విషయంలో సంచలన నిర్ణయం.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ లీక్!

  • Venkatesh-Trivikram : ‘ఆదర్శ కుటుంబం’.. ఫ్యామిలీ డ్రామా అనుకుంటే పొరపాటే..

  • Chiranjeevi NTR National Award: మెగాస్టార్‌కు ఎన్టీఆర్ అవార్డు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions