Off The Record : HCU భూముల వివాదంలో BJP MP పేరు బయట పెడతాననడంతో రాజకీయ రచ్చ
తెలుగు రాష్ట్రాల్లో…ఆ భూముల వ్యవహారంపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. పార్టీల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు గత చరిత్రను తవ్వుకుంటున్నారు. ఈ భూముల వ్యవహారంలో బీజేపీ నేత ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే…ఆ ఎంపీ ఎవరో చెప్పాలని కాషాయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలిలోని సెంట్రల్ వర్సిటీ భూముల రచ్చరచ్చ అవుతోంది. 400 ఎకరాల భూమి హెచ్సీయూకా? ప్రభుత్వానిదా? అనే వివాదం కొనసాగుతూనే ఉంది. 400 ఎకరాల స్కాం వెనుక బీజేపీ ఎంపీ ప్రమేయం ఉందంటూ…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాంబు పేల్చారు. అక్కడితో ఆగని ఆయన…భూముల వెనుక 10వేల స్కాం జరిగిందని అన్నారు. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అయితే…కాషాయ పార్టీకి చెందిన ఓ ఎంపీ సంపూర్ణ సహయసహాకారాలు అందిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ట్రస్ట్ అడ్వైజరీ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందని…సదరు కంపెనీ రేవంత్రెడ్డికి బ్రోకరిజం చేసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రస్ట్ అడ్వైజరీ ఇన్వెస్ట్మెంట్కు 170 కోట్లు లంచం ఇచ్చారంటూ…సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. బీజేపీ ఎంపీకి రేవంత్రెడ్డి అనుచిత లబ్ది చేకూరుస్తున్నారని…త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ పేరు పెడతాననడం రాజకీయ రచ్చకు దారి తీస్తోంది.
కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్రావు సెటైర్లు వేశారు. ఎవరో ఉన్నారని చెబితే ఎలా ? ముందు ఎంపీ పేరు బయటపెట్టాలంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ ఇవాళ బిజెపి ఎంపీ పేరు బయటపెడుతారని భావించారు. ఆయన మాత్రం మరోసారి వాయిదా వేశారు. ఇంతకీ కేటీఆర్ ఆరోపిస్తున్న ఎంపీకి…తెలంగాణతో సంబంధం లేదట. సదరు ఎంపీ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారని ప్రచారం జరుగుతోంది. ఆ ఎంపీ పేరు ఇంకా బయటకి రాకపోయినా…వదంతులు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఈ భూముల వ్యవహారంలో చక్రం తిప్పిందీ, వ్యవహారాన్ని సమర్థంగా డీల్ చేసిన వ్యక్తి ఆయనేనని కారు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రఘునందన్ సవాల్కు కేటీఆర్ స్పందిస్తారా ? ఆ ఎంపీ పేరును బయట పెడుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
- Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!