Off The Record: వరంగల్ బీఆర్ఎస్లో తిరుగులేని ఆ నేతలు ఇప్పుడు కారును ఖాళీ చేస్తున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి వరంగల్లో కారు ఖాళీ అవుతోందా? ఉక్కపోతనో… ఇంకోటనో… ఏదో ఒక సారు చెప్పేసి నేతలంతా ఉన్నపళంగా కారు దిగేస్తున్నారా? బీఆర్ఎస్కు ఒకప్పుడు తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వరంగల్లో ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది? లీడర్స్, కేడర్ ఏమంటున్నారు? లెట్స్ వాచ్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపే ముఖ్య నాయకులను చేర్చుకుంటూ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పార్టీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆత్మకూరు ఎంపీపీ, జడ్పీటీసీలు, మరికొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ వైపు నడిచారు. ఆ తరువాత గీసుగొండ ఎంపీటీసీలు, పరకాల ఎంపీపీ కూడా బీఆర్ ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రేటర్ వరంగల్లో పట్టు సాధించేందుకు పలువురు కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకున్న కాంగ్రెస్ నేతలు పరోక్షంగా వారి నుండి నుంచి సహకారం తీసుకున్నారు. ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేసిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టచ్లోనే ఉన్నారట. తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి సైతం కాంగ్రెస్లో చేరేందుకు పావులు కదుపుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ని చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ ఎత్తుగడలు వేస్తోందని పసిగట్టిన మేయర్ ముందు జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. అలాగే 15 మంది కార్పొరేటర్స్కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారట.
Also Read
- Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కీలక నేత అయిన మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ బాట పట్టారు. వీరితోపాటు వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకొని దేనికైనా రెడీ అంటున్నారట. మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి సైతం పొలిటికల్ పుట్టింటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. కాంగ్రెస్ నుంచి ఎదిగిన పద్మావతి తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరేందుకు కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఒకటి రెండు రోజుల్లో ఆమె కండువా మార్చడం ఖాయమని తేలిపోయింది. ఇక టేకుమట్ల జడ్పిటిసి తిరుపతిరెడ్డి సైతం బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరూ కండువా మార్చేస్తారట. ఇక అన్నిటికీ మించి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ సైతం పార్టీని వీడుతుండడంఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి పెద్ద కుదుపేనంటున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో కారు పార్టీకి ఎలాంటి సమస్యలు వస్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!