Off The Record: కర్ణాటక ఎన్నికలపైనే తెలంగాణ బీజేపీ నేతల ఆశలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా…ఆ ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందని కాషాయ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఎన్నికలు జరిగిన చోట బీజేపీ గెలిస్తే ఇక్కడా చేరికలు ఉంటాయట. ఐతే…చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. పలితాలు వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం వారు ఊహించిన స్థాయిలో చేరికలు జరగనేలేదు. ఎక్కడైనా ఎన్నికలు జరిగి బీజేపీ గెలిస్తే ఆ ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని బీజేపీ నేతలు ఢంకా బజాయించి చెబుతూ ఉంటారు. ఇక…ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల ఆశలన్నీ కర్ణాటక ఎన్నికలపైనే ఉన్నాయి. అక్కడ గెలిస్తే తెలంగాణలోనూ ఆ ప్రభావం భారీ స్థాయిలో ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. అమిత్ షా లాంటి వారు కూడా దక్షిణాదికి ఎంట్రీ అయిన కర్ణాటకలో మళ్లీ గెలుస్తామంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఆ తరువాత సౌత్లో అధికారంలోకి వచ్చేది తెలంగాణలోనేనట.
Read Also: Off The Record: హాట్టాపిక్గా మారిన బాలినేని వ్యవహారం..! వైసీపీలో ప్రకంపనలు
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ఐతే.. కర్నాటకలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ బలహీనపడుతుందని కాషాయ నేతలు భావిస్తున్నారని టాక్. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోను పార్టీపై విశ్వాసం సన్నగిల్లుతుందని అనుకుంటున్నారట. అదే సమయంలో బిజెపిలోకి చేరికలు ఉంటాయని అంచనాలు వేసుకుంటున్నారు. ప్రజల్లో తమ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని…కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ప్లాన్స్లో కాషాయ నేతలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీలో ఉత్సాహం పెరుగుతుందని…ఆ ప్రభావం బీజేపీపై పడుతుందని అంచనాలతో ఉంది కాషాయదళం. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ పట్టు కొనసాగే అవకాశం ఉంటుందని బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు…తెలంగాణ బీజేపీ నేతలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇరవై నియోజకవర్గాలకు ఇంఛార్జ్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం తెలంగాణ నేతలు చెమటోడుస్తున్నారు. కర్ణాటక గెలిస్తే తెలంగాణలోనూ తమకు గెలుపు ఖాయం అవుతుందనుకుంటున్నారు టీ బీజేపీ నేతలు. కర్నాటక తరువాత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. అక్కడ గెలిచి ఇక్కడ ఊపు తీసుకురావాలని కమలం పెద్దలు ఆలోచనతో ఉన్నట్టు పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. మరి…బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!