CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chief Minister Revanth Reddy: తనను మభ్యపెట్టడం అంత ఈజీ కాదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పరిపాలనలో కామన్ సెన్స్ అనేదే ముఖ్యమని.. కామన్ సెన్స్తో సమస్యలు పరిష్కారం చేసేవే ఎక్కువ అని తెలిపారు. తాజాగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కేసీఆర్ మీడియా పీపుల్స్ను కూడా మీడియా సమావేశానికి పిలుస్తానన్నారు. వాళ్ళ మైండ్ సెంట్ ఏంటో తెలుసుకుంటానని చెప్పారు. తనకు వేరే ఏ పని లేదని.. 16 నుంచి 18 గంటలు పని చేస్తానన్నారు. తాను ఫుట్బాల్ ఆడతానని.. అందుకే మెస్సీని తీసుకువచ్చినట్లు తెలిపారు. యువతను క్రీడల వైపు మళ్లించాలనేది తన లక్ష్యమని చెప్పారు. తాను కొద్ది మంది జర్నలిస్ట్లతో రాత్రి సమయంలో మాట్లాడతానని, పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటా అన్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినా చూస్తానని, దాని నుంచి కూడా కొంత సమాచారం వస్తుందన్నారు. పేదలు చెరువు పరిసరాలు ఆక్రమించుకున్నారు అంటే అర్ధం చేసుకుంటానని.. కానీ పెద్ద వాళ్ళు కూడా చెరువులను అక్రమిస్తే ఎట్లా? అని ప్రశ్నించారు. హైడ్రా వచ్చాక.. ఎవరైనా ఇప్పుడు దైర్యం చేస్తారా అడగండి. చెరువు కబ్జా చేయడానికి ఆలోచన చేస్తారేమో అని నిలదీశారు.
ఓ వైపు క్యాస్టిజం వద్దంటం. మరో వైపు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వేరే హాస్టల్స్ పెడుతుంటామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. “అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్న. అందరూ అందులో చదువుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది మేమే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయలేదు. ఓబీసీ జనాభా లెక్కలు కూడా లేవు. తెలంగాణలో ఆ లెక్కలు కూడా తేల్చేశాం. వెనకబాటు తనం, ఆర్ధిక పరమైన అంశమే కాదు. విద్యా, సామాజిక అంశాలు. మేము పేద విద్యా్ర్థులు చదువుకునే పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేము పిల్లని ఇంటి నుంచి స్కూల్ వరకు వాహనాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది ప్రభుత్వం స్కూల్స్లో లక్ష మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్, బ్రేక్ఫాస్ట్, ఏర్పాటు చేస్తున్నాం. మా నాన్న రైతు. అందుకే మేము గోచి కడతాం పంచెలు, దోతీలు కూడా కడతాం. మా ఆహార్యం అలాగే ఉంటుంది. రాజశేఖర్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి. ఫ్రెండ్లీ మ్యాచ్ లాగే.. నా పొరుగు రాష్ట్రాలతో ఉంటా. హైడ్రా లాంటి ఆలోచన అన్ని రాష్ట్రాలకు అవసరం లేదు. మెట్రో పాలిటన్ సిటీలకు అవసరం. మహిళా రిజర్వేషన్కి మేం హక్కుదారులం. మహిళను రాష్ట్రపతి, ముఖ్యమంత్రులను చేసింది మేమే. సోనియా గాంధీ మహిళలకు రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేశారు. మోడీ పొలిటికల్ ఫార్ములా వాడుతున్నారు. మేము నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. మోడీ చేస్తున్న ఆలోచనకి వ్యతిరేకం. తెలంగాణ, కర్ణాటకలో కూడా బీజేపీ ఎంపీలు గెలిచారు. కానీ కేంద్ర కేబినెట్లో ప్రధాన కేంద్ర మంత్రి పదవులు లేవు. ఢిల్లీలో దక్షణాది ఎంపీలు సెకండ్ గ్రేడ్ పీపుల్స్ లాగా చూడొద్దు అంటున్నాం.” అని సీఎం వ్యాఖ్యానించారు.
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
తాజావార్తలు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..