CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chief Minister Revanth Reddy: తనను మభ్యపెట్టడం అంత ఈజీ కాదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పరిపాలనలో కామన్ సెన్స్ అనేదే ముఖ్యమని.. కామన్ సెన్స్తో సమస్యలు పరిష్కారం చేసేవే ఎక్కువ అని తెలిపారు. తాజాగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కేసీఆర్ మీడియా పీపుల్స్ను కూడా మీడియా సమావేశానికి పిలుస్తానన్నారు. వాళ్ళ మైండ్ సెంట్ ఏంటో తెలుసుకుంటానని చెప్పారు. తనకు వేరే ఏ పని లేదని.. 16 నుంచి 18 గంటలు పని చేస్తానన్నారు. తాను ఫుట్బాల్ ఆడతానని.. అందుకే మెస్సీని తీసుకువచ్చినట్లు తెలిపారు. యువతను క్రీడల వైపు మళ్లించాలనేది తన లక్ష్యమని చెప్పారు. తాను కొద్ది మంది జర్నలిస్ట్లతో రాత్రి సమయంలో మాట్లాడతానని, పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటా అన్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినా చూస్తానని, దాని నుంచి కూడా కొంత సమాచారం వస్తుందన్నారు. పేదలు చెరువు పరిసరాలు ఆక్రమించుకున్నారు అంటే అర్ధం చేసుకుంటానని.. కానీ పెద్ద వాళ్ళు కూడా చెరువులను అక్రమిస్తే ఎట్లా? అని ప్రశ్నించారు. హైడ్రా వచ్చాక.. ఎవరైనా ఇప్పుడు దైర్యం చేస్తారా అడగండి. చెరువు కబ్జా చేయడానికి ఆలోచన చేస్తారేమో అని నిలదీశారు.
ఓ వైపు క్యాస్టిజం వద్దంటం. మరో వైపు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వేరే హాస్టల్స్ పెడుతుంటామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. “అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్న. అందరూ అందులో చదువుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది మేమే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయలేదు. ఓబీసీ జనాభా లెక్కలు కూడా లేవు. తెలంగాణలో ఆ లెక్కలు కూడా తేల్చేశాం. వెనకబాటు తనం, ఆర్ధిక పరమైన అంశమే కాదు. విద్యా, సామాజిక అంశాలు. మేము పేద విద్యా్ర్థులు చదువుకునే పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేము పిల్లని ఇంటి నుంచి స్కూల్ వరకు వాహనాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది ప్రభుత్వం స్కూల్స్లో లక్ష మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్, బ్రేక్ఫాస్ట్, ఏర్పాటు చేస్తున్నాం. మా నాన్న రైతు. అందుకే మేము గోచి కడతాం పంచెలు, దోతీలు కూడా కడతాం. మా ఆహార్యం అలాగే ఉంటుంది. రాజశేఖర్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి. ఫ్రెండ్లీ మ్యాచ్ లాగే.. నా పొరుగు రాష్ట్రాలతో ఉంటా. హైడ్రా లాంటి ఆలోచన అన్ని రాష్ట్రాలకు అవసరం లేదు. మెట్రో పాలిటన్ సిటీలకు అవసరం. మహిళా రిజర్వేషన్కి మేం హక్కుదారులం. మహిళను రాష్ట్రపతి, ముఖ్యమంత్రులను చేసింది మేమే. సోనియా గాంధీ మహిళలకు రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేశారు. మోడీ పొలిటికల్ ఫార్ములా వాడుతున్నారు. మేము నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. మోడీ చేస్తున్న ఆలోచనకి వ్యతిరేకం. తెలంగాణ, కర్ణాటకలో కూడా బీజేపీ ఎంపీలు గెలిచారు. కానీ కేంద్ర కేబినెట్లో ప్రధాన కేంద్ర మంత్రి పదవులు లేవు. ఢిల్లీలో దక్షణాది ఎంపీలు సెకండ్ గ్రేడ్ పీపుల్స్ లాగా చూడొద్దు అంటున్నాం.” అని సీఎం వ్యాఖ్యానించారు.
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!