Off The Record: తెలంగాణ బీజేపీలో కొత్త టెన్షన్.. ఆ నేతల పదవులు ఊడినట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ బీజేపీలో ఇప్పుడు కొత్త దృశ్యం కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణిలో ఈ కల్లోలం స్పష్టంగా కనిపిస్తున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. టీ బీజేపీ కొత్త అధ్యక్షుడే అందుకు కారణం అన్నది ఆ వర్గాల మాట. పార్టీ రాష్ట్ర కమిటీలో మార్పులు చేర్పులు ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తన టీంలో కొంత మందిని మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. రాష్ట్ర పదాధికారుల్లో కొంత మందికి ఉద్వాసన ఉంటుందని, జిల్లా అధ్యక్షులను సైతం తప్పిస్తారన్న చర్చ ఇప్పటికే జరుగుతోంది. మార్పులు ఉంటే తమకు ఛాన్స్ ఇవ్వాలని ఈపాటికే బండి దగ్గర లాబీయింగ్ కూడా చేసేశారట కొందరు నాయకులు. అయితే వివిధ కారణాలతో అలాంటి మార్పులు ఏమీ జరగలేదు. కానీ… తనను తప్పించడానికి కొద్ది రోజుల ముందే కొత్తగా దాదాపు100 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని నియమించారు బండి సంజయ్.
Read Also: Off The Record: వైఎస్ జయంతికి ట్వీట్ చేసిన రాహుల్.. రాజకీయ వ్యూహం ఉందా?
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
అయితే… ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మారారు. కిషన్ రెడ్డి పాత కమిటీలను ఉంచుతారా? లేక సొంత టీమ్ని ఏర్పాటు చేసుకుంటారా అన్న ఆందోళన కొందరు నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందట. మార్పులు జరిగితే మా పదవులు ఉంటాయా? ఊడతాయా అని పార్టీ ముఖ్యులందరి దగ్గర ఆరాతీస్తున్నారట అలాంటి భయాలున్న నాయకులు. కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు కమిటీల్లో మార్పులు జరగడం కామన్. ఎవరు పగ్గాలు చేపట్టినా… తన సొంత జట్టు కావాలని కోరుకోవడం సాధారణంగా జరిగేదే. కానీ…పదవులు చేపట్టి ఎక్కువ రోజులు కానివారు, ఎన్నికల టైంలో పార్టీలో క్రియాశీలకంగా ఉండాలనుకుంటున్న నాయకులే ఇప్పుడు ఎక్కువగా టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది.
Read Also: Karnataka CM: ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య
మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా టైం లేనందున ఇప్పుడు కిషన్ కొత్త జట్టును ఏర్పాటు చేసుకుంటారా? లేక ఉన్నవాళ్ళతోనే లాగించేస్తారా అన్న చర్చ కూడా నేతల మధ్య జరుగుతున్నట్టు తెలిసింది. ఈ విషయంలో కిషన్రెడ్డి కూడా ఇప్పటిదాకా నోరు విప్పలేదు. మార్పులు ఉంటాయనిగాని, ఉండవని గాని చెప్పకపోవడంతో నేతల్లో టెన్షన్ ఇంకా పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఏ నిర్ణయమైనా … సమష్టిగానే ఉంటుందన్న సంకేతాలు మాత్రం వస్తున్నాయట. పూర్తిగా కాకున్నా.. కొంతమేరకైనా…. మార్పులు ఉండవచ్చని, అదికూడా పార్టీ కేంద్ర నాయకత్వం సూచనల మేరకేనన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి… ఈ పరిణామాలతో ప్రస్తుత కమిటీలో ఉన్న కొందరిలో మాత్రం గుబులు మొదలైందట. పార్టీ పదవులు ఊడకుండా ఎవరి పరిధిలో వారు లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..