Off The Record: జేసీ, శైలజానాథ్ మీటింగ్పై ఉత్కంఠ.. టీడీపీ వైపు అడుగులు పడుతున్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొందరు సీనియర్ నాయకుల అడుగులు చర్చనీయాంశం అవుతున్నాయి. చాలా మంది నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకుల అడుగులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల మీటింగ్పై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ల భేటీ విషయంలో రకరకాల ఊహాగానాలు పెరుగుతున్నాయి. జిల్లాలో ఒకప్పుడు ఇద్దరూ కీలకమైన నేతలు కావడంతో ఆసక్తి మరింత పెరుగుతోంది.
తెలుగుదేశం పార్టీలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత శైలజనాథ్ కలవడమే ఇక్కడ విశేషం. ఇద్దరూ కాంగ్రెస్లో సుదీర్ఘకాలం కలిసి పనిచేసినవారే.
జేసీకి, శైలజనాథ్ తో మొదట్లో మంచి సంబంధాలే ఉన్నా తర్వాత దూరం పెరిగింది. వై యస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక దివాకర్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. అదే సమయంలో శైలజానాథ్కు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జేసీ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. 2019లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని తన కుమారుడిని అనంతపురం పార్లమెంటు నుంచి పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో జేసీ పవన్ ఓడిపోవడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్లోనే కొనసాగుతున్న శైలజనాథ్ చాలాసార్లు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగినా చివరికి అది ప్రచారంగానే మిగిలిపోయింది. కానీ… ఇప్పుడు మాత్రం ఆయన సైకిల్ సైడ్ గట్టిగా అడుగులు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరి మీటింగ్ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ఈ విషయంలో ఇద్దరు నాయకులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ… శైలజానాథ్ టీడీపీలోకి వెళ్తారన్న అనుమానాలను మాత్రం పెంచింది మీటింగ్.
మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల రాయల తెలంగాణ పేరుతో హడావిడి చేశారు. త్వరలో రాయలసీమ ప్రాంత నేతలందరినీ కలుస్తానని ఆ సందర్భంగా ప్రకటించారు. ఈ భేటీ ఆ కోణంలో జరిగిందా? శైలజానాథ్ పార్టీ మార్పులో భాగమా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం కోసం శైలజ నాథ్ పనిచేశారు. అలాంటి వ్యక్తి రాయల తెలంగాణకు మద్దతు ఇచ్చే అవకాశం లేదన్నది ఆయన సన్నిహితుల మాట. తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వైసీపీకి వ్యతిరేకంగా దివాకర్రెడ్డి పావులు కదుపుతున్నారని, అందులో భాగంగా కలిసి ఉండవచ్చన్నది మరో వాదన. ఏదేమైనా ఈ ఇద్దరు సీనియర్స్ మీటింగ్ విషయంలో మాత్రం జిల్లా వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. వైసీపీకి వ్యతిరేకంగా బలమైన వర్గాన్ని తయారు చేస్తున్నారా అన్నది రాజకీయ వర్గాల్లో పెరుగుతున్న అనుమానం.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!