Off The Record: కొడుకుల కోసం జానారెడ్డి సైడ్ అవుతున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ముమ్మరంగా దరఖాస్తులు చేసుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అయితే గతానికి భిన్నంగా ఈసారి చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఇందులో అతి ముఖ్యమైన, అందర్నీ ఆకట్టుకుంటున్నది సీనియర్ లీడర్ జానారెడ్డి ఫ్యామిలీ డ్రామా. జానారెడ్డి వారసులు తొలిసారి ఎన్నికల తెరంగేట్రం చేయాలనుకుంటున్నారు. ఫలానా నియోజకవర్గం నుంచి మేం పోటీ చేస్తాం.. మాకూ అవకాశం కల్పించమంటూ జానారెడ్డి ఇద్దరు కొడుకులూ దరఖాస్తులు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. తొలి నుంచి నాగార్జునసాగర్ కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్నారు జానా. ఆ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో సైతం ఆయనే బరిలో నిలిచారు. కానీ.. కొద్ది రోజులుగా ఆ నియోజకవర్గంలో జానారెడ్డి రెండో కుమారుడు జైవీర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తండాలన్నింటిని ఇప్పటికే ఒక రౌండ్ చుట్టి వచ్చారు. టికెట్ ఆశావాహుల దరఖాస్తులో కూడా ఈసారి పార్టీ నాగార్జునసాగర్ టికెట్ తనకే ఇవ్వమని అప్లై చేశారాయన. అదే సమయంలో అక్కడ పెద్ద దిక్కుగా ఉన్న జానారెడ్డి మాత్రం అప్లై చేయలేదు. ఇక్కడే… పార్టీ వర్గాలకు తేడా కొడుతోంది. మరోవైపు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఆయనైతే…నాగార్జునసాగర్తో పాటు మిర్యాలగూడ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఓ వైపు జానారెడ్డి అప్లై చేయలేదు. మరోవైపు ఆయన చేతిలో ఉన్న నియోజకవర్గం కోసం ఇద్దరు కొడుకులు చేశారు. అంటే… ఏంటీ ఫ్యామిలీ డ్రామా అన్న చర్చ జరుగుతోంది పార్టీలో. సరే… ఒకరు దరఖాస్తు చేశారంటే వేరే సంగతి. అన్నదమ్ములిద్దరూ నాగార్జున సాగర్ని కోట్ చేయడం ఏంటన్నది పార్టీ వర్గాలకు కూడా అంతుబట్టడం లేదట. అంటే… ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇచ్చినా ఫర్లేదంటూ కలిసే దరఖాస్తు చేశారా? లేక నేనంటే నేనంటూ పోటా పోటీగా రేస్లోకి వచ్చారా అన్న అనుమానాలు సైతం కలుగుతున్నాయి. అదే సమయంలో జానారెడ్డి ఇక రిటైర్మెంట్ తీసుకున్నట్టేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పెద్ద కొడుకు రఘువీర్ ఇప్పటికే మిర్యాలగూడపై కన్నేశారు. ఆయన అక్కడ బరిలో ఉంటారని ప్రచారం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తి దాంతో పాటు సాగర్కి కూడా ఎందుకు దరఖాస్తు చేశారన్న ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదంటున్నాయి పార్టీ వర్గాలు. జానారెడ్డి ఇద్దరు కుమారులకు టిక్కెట్స్ ఇప్పించుకోగలుగుతారా? ఆయన పోటీలో లేకపోవడానికి కారణాలు ఏంటి? దానివెనక ఉన్న వ్యూహం ఏంటన్న చర్చ జోరుగా జరుగుతోంది. నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తిగా మారింది.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!