Off The Record: చివరి నిమిషంలో ఆగిపోయిన చేరిక..! ఆ మాజీ మంత్రి చేరిక ఉంటుందా.. ఉండదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళి మరీ… పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే… తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతా ఆదివారం నాడు ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమై దళిత డిక్లరేషన్ పై చర్చించారు. మీటింగ్ అయ్యాక చంద్రశేఖర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సింది. కానీ… ఆ ఒక్కటి మాత్రం జరగలేదు. ఢిల్లీ వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్కే పరిమితం అయ్యారు. పీసీసీ ఛీఫ్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకోవడం, చంద్రశేఖర్ చేరిక వాయిదా పడటంతో.. అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది పార్టీలో. రకరకాల విశ్లేషణలతో హీట్ పెంచుతున్నారు నాయకులు.
2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్లోనే ఉన్న చంద్రశేఖర్ వికారాబాద్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ.. టికెట్ ఇవ్వకపోవడంతో సొంత పార్టీ అభ్యర్థి మీదే రెబెల్గా మారారు. దీంతో అప్పట్లో పిసిసి క్రమశిక్షణ కమిటీ ఆయన్ని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఎత్తేయకుండానే మాజీ మంత్రిని తిరిగి పిలిచి 2019లో లోక్సభ పోటీ చేయించారు పార్టీ పెద్దలు. పెద్దపెల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారాయన. ఆ వెంటనే బీజేపీ గూటికి చేరిపోయారు. ఇప్పుడు తీరా.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి కాంగ్రెస్ లో చేరడానికి పావులు కదుపుతున్నారు చంద్రశేఖర్. ఇదే విషయమై పార్టీలో కొందరు సీనియర్స్ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారట. ఎన్నికలకు ముందు పార్టీలోకి రావడం.. ఓడిపోయాక బయటికి వెళ్లడం, మళ్లీ వచ్చేస్తానంటే చేర్చుకోవడమేనా..? ఒక పద్ధతంటూ లేదా అని అభ్యంతరం చేశారట ఒకరిద్దరు సీనియర్స్.
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
దీని మీదే ఢిల్లీ నాయకత్వం రాష్ట్ర పార్టీని వివరణ కోరినట్టు తెలిసింది. పార్టీ బలోపేతం కోసం చేరికలు ఉండాలి గాని.. అవకాశ వాదంగా కేవలం ఎన్నికల ముందు చేరి తర్వాత బయటకు వెళ్లే వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పెద్దలు పీసీసీని హెచ్చరించినట్టు తెలిసింది. సీజన్కు తగ్గట్టు పదే పదే పార్టీలు మారుస్తున్న ఇలాంటి వారిని సరిగ్గా ఎన్నికలకు ముందు చేర్చుకుని టిక్కెట్స్ ఇస్తే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సూచనలు అధిష్టానం నుంచి రావడంతో… చంద్రశేఖర్ చేరిక డైలమాలో పడ్డట్టు చెప్పుకుంటున్నారు. కండువా కప్పాల్సిన అగ్ర నేతలే పీటముడి వేయడంతో కార్యక్రమం వాయిదా పడిందట. అందుకే ఢిల్లీకి వెళ్లాల్సిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తన పర్యటనను రద్దు చేసుకున్నారన్నది పార్టీ వర్గాల టాక్. అయితే కాంగ్రెస్లో ఇలాంటివన్నీ సహజమన్నది పార్టీ వ్యవహారాల గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. ప్రస్తుతానికి కాస్త వెనక్కు తగ్గినట్టుగా ఉన్నా… కొద్ది రోజుల తర్వాత మళ్లీ కదలిక వస్తుందా లేక చంద్రశేఖర్కు పర్మినెంట్గా గేట్లు మూసేసినట్టేనా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!