Off The Record: చివరి నిమిషంలో ఆగిపోయిన చేరిక..! ఆ మాజీ మంత్రి చేరిక ఉంటుందా.. ఉండదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళి మరీ… పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే… తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతా ఆదివారం నాడు ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమై దళిత డిక్లరేషన్ పై చర్చించారు. మీటింగ్ అయ్యాక చంద్రశేఖర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సింది. కానీ… ఆ ఒక్కటి మాత్రం జరగలేదు. ఢిల్లీ వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్కే పరిమితం అయ్యారు. పీసీసీ ఛీఫ్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకోవడం, చంద్రశేఖర్ చేరిక వాయిదా పడటంతో.. అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది పార్టీలో. రకరకాల విశ్లేషణలతో హీట్ పెంచుతున్నారు నాయకులు.
2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్లోనే ఉన్న చంద్రశేఖర్ వికారాబాద్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ.. టికెట్ ఇవ్వకపోవడంతో సొంత పార్టీ అభ్యర్థి మీదే రెబెల్గా మారారు. దీంతో అప్పట్లో పిసిసి క్రమశిక్షణ కమిటీ ఆయన్ని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఎత్తేయకుండానే మాజీ మంత్రిని తిరిగి పిలిచి 2019లో లోక్సభ పోటీ చేయించారు పార్టీ పెద్దలు. పెద్దపెల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారాయన. ఆ వెంటనే బీజేపీ గూటికి చేరిపోయారు. ఇప్పుడు తీరా.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి కాంగ్రెస్ లో చేరడానికి పావులు కదుపుతున్నారు చంద్రశేఖర్. ఇదే విషయమై పార్టీలో కొందరు సీనియర్స్ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారట. ఎన్నికలకు ముందు పార్టీలోకి రావడం.. ఓడిపోయాక బయటికి వెళ్లడం, మళ్లీ వచ్చేస్తానంటే చేర్చుకోవడమేనా..? ఒక పద్ధతంటూ లేదా అని అభ్యంతరం చేశారట ఒకరిద్దరు సీనియర్స్.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
దీని మీదే ఢిల్లీ నాయకత్వం రాష్ట్ర పార్టీని వివరణ కోరినట్టు తెలిసింది. పార్టీ బలోపేతం కోసం చేరికలు ఉండాలి గాని.. అవకాశ వాదంగా కేవలం ఎన్నికల ముందు చేరి తర్వాత బయటకు వెళ్లే వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పెద్దలు పీసీసీని హెచ్చరించినట్టు తెలిసింది. సీజన్కు తగ్గట్టు పదే పదే పార్టీలు మారుస్తున్న ఇలాంటి వారిని సరిగ్గా ఎన్నికలకు ముందు చేర్చుకుని టిక్కెట్స్ ఇస్తే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సూచనలు అధిష్టానం నుంచి రావడంతో… చంద్రశేఖర్ చేరిక డైలమాలో పడ్డట్టు చెప్పుకుంటున్నారు. కండువా కప్పాల్సిన అగ్ర నేతలే పీటముడి వేయడంతో కార్యక్రమం వాయిదా పడిందట. అందుకే ఢిల్లీకి వెళ్లాల్సిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తన పర్యటనను రద్దు చేసుకున్నారన్నది పార్టీ వర్గాల టాక్. అయితే కాంగ్రెస్లో ఇలాంటివన్నీ సహజమన్నది పార్టీ వ్యవహారాల గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. ప్రస్తుతానికి కాస్త వెనక్కు తగ్గినట్టుగా ఉన్నా… కొద్ది రోజుల తర్వాత మళ్లీ కదలిక వస్తుందా లేక చంద్రశేఖర్కు పర్మినెంట్గా గేట్లు మూసేసినట్టేనా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!