Off The Record: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మళ్లీ టికెట్ దక్కేది ఎవరికి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు కేసీఅర్. వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ … ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే… ఈసారి సిట్టింగ్లలో టిక్కెట్లు దక్కేది ఎవరికి? నో చెప్పేది ఎవరికన్న చర్చ మొదలైంది. దీనికి తోడు గురువారం హైదరాబాద్లో జరిగిన BRS రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ఎమ్మెల్యేల్లో సెగలు రేపుతున్నాయట. ఒక వైపు ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి … అసంతృప్త గళాలు పెరగడానికి… ఇప్పుడు కేసీఅర్ మాటలు తోడవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట ఎమ్మెల్యేలు.
శాసనసభ్యులు నిత్యం ప్రజల్లో ఉండాలని ప్రతినిధుల సమావేశంలో సూచించారు కేసీఅర్. గతంలో చెప్పినట్టుగానే సిట్టింగ్లకే టికెట్లని ఈసారి కూడా అన్నారట. కానీ ఈ సారి ఒక అడుగు ముందుకేసి ప్రజల్లో ఆదరణ లేకపోతే తాను కూడా ఏం చేయలేనని వార్నింగ్ ఇచ్చారు. టికెట్ల పంచాయితీ ఎందుకు అని , ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసునని తేల్చేశారట కేసీఆర్. ఇప్పుడు సిట్టింగ్లలో టెన్షన్ అందుకేనట. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని అనుకుంటున్న సీఎం ఈసారి 100 సీట్లు టార్గెట్గా పెట్టుకున్నారు. అందుకే టిక్కెట్స్ విషయంలో అస్సలు మొహమాటాలు లేకుండా గెలుపు గుర్రాలనే ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట. అందుకే ఎమ్మెల్యేల మీద వస్తున్న ఆరోపణల విషయంలో కూడా సీరియస్గానే స్పందించినట్టు చెబుతున్నారు. పనితీరు మార్చుకోకుంటే.. మిమ్మల్ని నేనే మార్చాల్సి వస్తుందని నేరుగానే చెప్పేశారట. మొత్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల పరంగా కేసీఅర్ పెట్టిన ఫిట్టింగ్ తో ఎవరి రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన పెరుగుతోందట బీఆర్ఎస్లో.
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!