Off The Record: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్..? బీఆర్ఎస్ నేతలు క్యూలో ఉన్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: లోక్సభ ఎన్నికల ముంగిట్లో తెలంగాణ కాంగ్రెస్… గేట్లెత్తిందా? ఆపరేషన్ ఆకర్ష్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? అంటే.. అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు. వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయిన పాత నాయకులను తిరిగి రప్పించడంపై అధి నాయకత్వం సీరియస్గా దృష్టిపెట్టినట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. రాజకీయ ప్రత్యర్థులపై పంజా గట్టిగానే విసరాలని సీఎం డిసైడైనట్టు ప్రచారం జరుగుతోంది. దాని చుట్టూనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. ఢిల్లీ టూర్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకు పార్టీ ప్రధాన కారుదర్శి కేసీ వేణుగోపాల్ తో కండువా కప్పించారు సీఎం రేవంత్రెడ్డి. అదే సమయంలో మన్నే జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ టిక్కెట్ కోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ పరిణామాన్ని .. ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపినట్టుగానే చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 12 ఎంపీ సీట్లు గెలవాలన్న కసిగా ఉంది తెలంగాణ కాంగ్రెస్.
సీఎంగా రేవంత్రెడ్డి ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక కావడంతో ఆయనకు కూడా ఇది సవాల్గా మారిందట. రాష్ట్రంలో అధికారం లోకి రావడం ఒక ఎత్తయితే… వచ్చిన అధికార బలంతో పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వడమన్నది మరో ఎత్తుగా భావిస్తున్నాయి రాజకీయవర్గాలు. సీఎంకి ఇది మేజర్ టాస్క్ కాబట్టి చేరికలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి నాయకులు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి తాజా పరిణామాలు. వెంకటేష్ నేతతో పాటు.. బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కూడా కాంగ్రెస్కు క్యూలో ఉన్నారనే టాక్ మొదలయింది. అలాగే మాజీ మంత్రి రాజయ్య కూడా గులాబీ కండువా తీసు పక్కన పెట్టేశారు. ఇప్పుడాయన మూడు రంగుల కండువా కప్పుకోవడం ఎప్పుడన్నది మాత్రమే తేలాల్సి ఉంది.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఇక, రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారన్న ప్రచారం ఉంది. మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి మీద కూడా రూమర్స్ నడుస్తున్నాయి. రంజిత్ రెడ్డి కారు దిగేయడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఎంపీతోపాటు ఆయనకు సన్నిహితంగా ఉండే మరో నేత కూడా కాంగ్రెస్ గూటికి చేరతారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. మొత్తంగా ప్రస్తుత వాతావరణాన్ని చూస్తుంటే…. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మరి కొందరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి గులాబీ రేకులు ఎన్ని రాలిపోతాయో, అలా రాలకుండా పార్టీ అధిష్టానం ఏం ట్రీట్మెంట్ ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?