Off The Record: అసలు నష్టం ఎక్కడ జరిగింది..? బీఆర్ఎస్ ఆఫీస్లో వాస్తు మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్…పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పార్టీకి పునర్ వైభవం తీసుకు రావాలని గులాబీ బాస్ కేసీఆర్ ప్రయత్నిస్తుంటే…ఒక్కొక్కరుగా పార్టీ వీడటం ఆ పార్టీని అంతర్గతంగా కుంగదీస్తోంది. ఇదే సమయంలో వస్తున్న ఒపీనియన్ పోల్స్ కూడా ఆశాజనకంగా లేవు. అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ ప్రదర్శన ఉండబోదని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితి నుంచి వెంటనే బయట పడాలని బిఆర్ఎస్ భావిస్తోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేసీఆర్ రంగంలోకి దిగారు. అసలు పార్టీకి నష్టం ఎక్కడ జరిగింది ? పార్టీ బలహీన పడటానికి కారణాలేంటని వాస్తు పండితుల సలహాలు సూచనలు తీసుకున్నారు. వారి సూచనలతో సలహాల మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం కార్యాలయానికి ఉన్న వాస్తు దోషం కారణంగానే.. బీఆర్ఎస్ పార్టీ ఎవీ కలిసి రావడం లేదని పండితులు..కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. వారి సలహాలు సూచనల మేరకు కార్యాలయానికి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ భవన్ తూర్పు అభిముఖంగా ఉంటే…వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అలా రాకపోకలు సాగించడం మంచిది కాదని పండితులు సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇకపై ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు సాగించాలని నిర్ణయించారట గులాబీ బాస్ కేసీఆర్. ఈ మేరకు వాహనాలు వచ్చి వెళ్లేలా కొత్తగా ర్యాంపును సిద్ధం చేస్తున్నారు. అలాగే వీధి పోటును దృష్టిలో ఉంచుకుని లక్ష్మినరసింహ స్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని సైతం గేటుకు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రాంగణంలో కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు సాగించడం వెనుక.. ట్రాఫిక్ సమస్య కూడా ఒక కారణం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వాయువ్యం దిశలో ఉన్న గేటు వద్ద కాసేపు కూడా వాహనాలు నిలిపే పరిస్థితి లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12 వైపు వెళ్లే రహదారి వెంట వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో తెలంగాణ భవన్లోకి వెళ్లేందుకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వాస్తు నిపుణుల సూచనల మేరకు తాజా మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ఒక వైపు అధికారం కోల్పోయిన బాధ, మరోవైపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలి అనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ మొదట…కార్యాలయంలో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా మార్పులు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ఎంత మేరకు కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..